Monday, January 7, 2019

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

    మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్ 
    శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు 
    వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
    మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు
    పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్ 
    కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ 
    శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద 
    కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.

భావం 

వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.

   అవతారిక

    'మమ్మల్ని కటాక్షింపవయ్యా!' అని ఎంత వేడినా పలుకకున్నవానిని చూచి, నీళాదేవి నాశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి 'అయ్యో! వీరినెంత బాధపెట్టితిని . వీరికి ముందుగనే, నేను కావలసినవి యిచ్చి వుండవలసినది. అని ఎంతో కలత చెందాడు, 'నావారినే నేను ఉపేక్షించాను. దినులై అర్ధించేటట్లు చేశాన' ని  ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసులనుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపేట్టినట్లుగానే నేడు యీ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే 'మీకేమికావలె' నని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తున్నాడు. 'మాకే కామనలు లేవు స్వామీ! నీవు నీ భవనము నుండి వచ్చి యీ సింహసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదుమ' నిరి .అదే యీ (పాశురంలో) వర్ణితము.

        అసావేరి రాగము __ అదితాళము

    ప..    రారా! మా స్వామి రారా!
        తీరుగ మముజూచి కృపసేయగ రార!
        రార! మా స్వామి రారా!

    అ.ప..    లేర! శయన గృహమును వీడి రావేర!
        వర సింహసనమును జేర రావేర!
 
    చ....    గిరి గుహల శయనించి మేల్కొను సింహమై _ కే
        సరముల విదిలించి నలుదెసలు పరికించి
        గర్జించి అలసత __ విసర్జించి ఆరుదేరు
        వీర సింహము వోలె వేవేగ రావేర'

    చ..     అతసీ సుమము వంటి తిర మేనుగల స్వామి
        ఈ తడవు నీశయన మందిరము వీడవే!
        పూత సింహాసన మ్మధివసింపగ రావె!
        ఆశ్రితుల మనవి విని కరుణింపగ రావె!

Sunday, January 6, 2019

తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం
తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం

    అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
    బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే
    శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్
    కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే
    శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;
    తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్ 
    అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్ 
    ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.

భావం

ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 

 అవతారిక 

పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.


        *(కల్యాణిరాగము - రూపక తాళము)*

ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ 
    ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!

అ..ప..సూర్యచంద్రులుదయించెనో u? యట్టుదోచు కనుదోయిని 
    పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!

1. చ..అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ 
    సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల 
    అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము 
    మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి 
    ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!

Saturday, January 5, 2019

తిరుప్పావై ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

తిరుప్పావై ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ 
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

భావం

పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 

అవతారిక

గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీ కృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను  శ్రీ కృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి  గోపికలతో కూడి శ్రీ కృష్ణుని అర్థించుచున్నది.

Thursday, January 3, 2019

తిరుప్పావై ఇరవదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై  ఇరవదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై  ఇరవదియవ పాశుర అనుసందానము

ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

భావం

ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము కలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము.

బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.

అవతారిక

గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీ కృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి.

ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపుతున్నారు.

స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట  తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,
    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్
    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై
    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్
    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్
    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్



భావం

గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  

    అవతారిక 

స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         

       *(కాపిరాగము - ఆదితాళము)*

ప..     తగదిది నీకిది తరుణిరొ వినవే!
    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!

అ..ప.    తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు
    మగని విశ్లేషమును సహింపజాలవె!
    దీప కాంతులెల్లెడళ విరియగా
    ఆ పంచగుణముల పడకను శయనించి
    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత
    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!
    ఓ పద్మాక్షీ! విభుని లేపవే!

Wednesday, January 2, 2019

తిరుప్పావై పద్దెనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై పద్దెనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై రేపటి పద్దెనిమిదవ రోజు పాశురం

         ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్
    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;
    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి
    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;
    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

భావం

నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.

అవతారిక

శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీ కృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి. ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీళాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపుచున్నారు. పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది. పెరుమాళ్ళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరినీ ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీళాదేవిని ప్రార్ధించి, మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్ధించుచున్నారు. శ్రీ కృష్ణుని దర్శింపజేయుమని వేడుకొంటున్నది మన గోదాదేవి.

        *(సావేరిరాగము - ఏకతాళము)*

ప..     మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
    నందగోవునికి కోడల! నప్పిన్నా! మేలుకో!

అ.ప.    గంధిల కుంతల తరుణీ! కోళ్ళు కూయుచున్నవదే
    మధుర కూజితములు సేయు పిక గణముల గనవటే!
 
చ.    నీ పతి శ్రీకృష్ణుని తిరు నామములను పాడిపాడి
    మా పాటల విభుని మేలుకొలుపగ నిట వచ్చినాము
    ఈ పదముల సంతసించి శ్రీ కంకణములు మ్రోయగ
    నీ పద్మకరాల గడియల నికనైనను తీయరావె!
    మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
    నందగోపునికి, కోడల! నప్పిన్నా! మేలుకో....

Tuesday, January 1, 2019

తిరుప్పావై పదిహేడవ రోజు పాశురము

తిరుప్పావై పదిహేడవ రోజు పాశురము


    అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
    ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
    కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
    ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
    అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
    ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
    శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
    ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

భావం

ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.

 అవతారిక

ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.     

        (ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)

ప..     లేవయ్యా మా స్వామి! నందగోపాలా!
    లేవయ్యా స్వామి! మా సర్వప్రదాతా!

అ..ప..    లేవమ్మ మాయమ్మా! లే యశోదమ్మా!
    లేవె! స్త్రీ జాతి కంతకును తలమానికమ!

చ..    ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ!
    మేలుకో! నిత్య సూరుల స్వామి!
    శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ!
    ఇంక నిదురింపకుమ! లెమ్ము! కృష్ణుని తోడ!
    లేవయ్య మా స్వామి! నందగోపాలా!
    లేవయ్య స్వామి మా సర్వప్రదాతా!

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');