Friday, March 15, 2019

గరుడ పురాణము - 8

గరుడ పురాణము - 8

అంతే కాదు ; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి.
గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను

జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని                      వ్యాసుడు స్వాయుంభువ మనువు
రెండవ ద్వాపరములో                                                      ప్రజాపతి
మూడవ ద్వాపరములో                                                   ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో                                                  బృహస్పతి
ఐదవ ద్వాపరములో                                                       సవితృడు
ఆరవ ద్వాపరములో                                                       మృత్యువు
ఏడవ ద్వాపరములో                                                       ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో                                                వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో                                                సారస్వతుడు
పదవ ద్వాపరములో                                                       త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో                                           త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో                                               శత తేజుడు
పదమూడవ ద్వాపరములో                                            ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో                                          తరక్షుడు
పదునైదవ ద్వాపరములో                                                త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో                                               ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో                                                కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో                                         ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో                                            భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో                                                 గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో                                          రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో                                         శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో                                       తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో                                      వాల్మీకి

Tuesday, March 12, 2019

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ హరీ!!! మనుషులు ప్రమాదాల వల్ల కానీ,పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే,వారు యమయాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించండి అని గరుత్మంతుడు అడుగగా శ్రీ హరి ఈ విధంగా చెప్తున్నాడు
ఓ గరుడా!! పుత్రులు లేనివారికి దుర్గతి కలుగుతుంది అని మొదట చెప్పబడుతున్నది. పుత్రవంతులు అయినప్పటికీ, ధర్మాత్ములకి ఎప్పుడూ దుర్గతి కలగదు. కనుక సంతానము కోసం శివ పూజాదికాలు జరిగించి ఏ ఉపాయము వల్ల అయినా పుత్రులు కలిగేలాగా చూసుకోవాలి. పుత్రుడే పున్నామ నరకం నుండి తల్లిదండ్రులని రక్షిస్తాడు. "పుత్ర" నామసార్ఢ్యమ్ ఇదే!!! ధర్మాత్ముడు అయిన ఒక పుత్రుని వల్ల వంశం అంతా తరిస్తుంది. వేదాలలో పుత్ర మహిమ వేనోళ్ళ కొనియాడ బడుతోంది. అలాగే, పౌత్రుని అంగస్పర్శము వలన దేవ ఋణము, పితృ ఋణం, ముని ఋణము తీరి ముక్తుడు అవుతాడు. స్వర్గానికి వెళ్తాడు బ్రహ్మ వివాహం శ్రేష్టం, అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుని కన్నా,స్వర్గ లోక ప్రాప్తి కలుగదు. ఇట్లే ఇతరులు చేసిన శ్రార్ధం వలన సైతం పొందినట్లు ఐతే సవర్ణ స్త్రీ వలన కలిగిన ఔరస పుత్రుల వలన చేయబడే శ్రార్ధం వలనను స్వర్గలోకం పొందగలుగుతారు.......అన్ని చెప్పగా......గరుడుడు శ్రీహరి ని చూసి ఓ పరమపురుషా!! ఈ ప్రేత జన్మల గురించి ఏమన్న కధ ఉన్నదా??? ఉన్నట్లు ఐతే అటువంటి కధ సవిస్తారం గా తెలపండి అని ప్రార్ధించాడు అందుకు సమాధానం గా ఓ పక్షిరాజా!!! త్రేతా యుగం నాటి గాథ ఒకటి నీకు వినిపిస్తాను. విను!!! ఆ యుగంలో భబ్రువాహనుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. ప్రముఖులచే సైతం ప్రశంసించబడిన వాడు. మహోదాయమనే నగరాన్ని రాజధాని గా చేసుకుని ప్రజారంజకం గా పాలన చేస్తూ ఒక నాడు అడవి లో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ ఆ అరణ్య మధ్యలోకి వెళ్లి దాని పై ఒక బాణం ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకుని అక్కడ నుండి పరుగెత్తిపోయింది. బభ్రువాహనుడు ఆ జింక శరీరం నుండి కారే రక్త ధారలు బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు అతడొక్కడే జింకను తరుముతూ వెళ్లడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతడా అడవి దారిలో తప్పి,అందులోనే ఇంకొక వనంలోకి ప్రవేశించాడు. జింక మాత్రం కనపడలేదు. బాగా అలిసిపోయి దాహం చేత నాలుక ఎండిపోతుంటే నీళ్లకోసం వెతకసాగాడు....... మరింత దూరం సాగిన తరువాత - దివ్యమైన జలంతో ఒక తామర కొలను కనిపించింది. బభ్రువాహనుడు. ఆ చెరువులోకి దిగి స్నానం చేసి, నీరు త్రాగి ఒక చెట్టు కింద తన పరివారం వెత్తుకుంటూ వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. చెట్టు నీడన కాస్త సేద తీరాడు.. ఇంతలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం కనపడింది. దానికి ఇతరులు ఎవరైనా భయపడాల్సిందే.... పరమవికారం గా ఆ లరేటనికి చేరువగా అటువంటివి మరికొన్ని ప్రేతలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం అతన్ని సమీపించి సంతోషం తో ఇలా అంది....... ఓ మహారాజా!!! నిన్ను దర్శించిన మాత్రము చేతనే ఈ ప్రేత దేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుడిని అయ్యాను అని వినయంగా పలికేసరికి, ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ ప్రేతమా!!! నీవెవరు??? నీకీ దుష్ట రూపం ఎలా వచ్చింది ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు ప్రేత రూపుని చరిత్ర......
అప్పుడు ఆ ప్రేతము ఓ మహారాజా!!! నా చరిత్ర చెప్తున్నాను వినుము..... వైదేశం అనే పట్టణం ఒకటి ఉంది. అది రధాలు,ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ,మనుష్య జాలంతో -- అన్ని విధాలా సంపదలతో అలరారుతూ ఉండేది. అలాంటి పట్టణంలో నేను వైశ్య కులంలో పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలం దేవపూజలు చేశాను, బ్రాహ్మణులని పెద్దలని పూజించాను. దేవాలయాలు నిర్మింపచేసాను, సత్రాలు వేయించాను, బీద బిక్కి దిక్కు లేని వారికి నాకు వీలు అయినంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసి ఏ జీవికి హాని తలపెట్టలేదు.నాకు భార్యా పుత్రులు లేరు.బంధువులు లేరు.మరణానంతరం ఈ లరేత జన్మ రావడానికి కారణం నాకెవ్వరు కర్మం చేయకపోవడమే పైగా నాకీ ప్రేత జన్మ సంభవించి చాలా కాలమే అయ్యింది. ఓ రాజ శ్రేష్ఠ!! నేను మీకోకటి అభ్యర్ధిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారం - సంచయనం నిత్య విధి,వృషోత్సర్జనం, షోడశం,సపిందీకరణం, మాసికం, శ్రార్ధం..... ఈ మొదలు అయినవన్ని పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసిందే!!! కానీ,ప్రభువు అయిన నీవు లోకభాందవుడవు. ఎవ్వరూ లేనివారికి నీవే ఆప్తుడవు-రక్షకుడివి కూడా. ప్రేత రూపంలో ఉన్న నన్ను ఈ ఆపద నుండి గట్టెకించగలిగావు. నా దగ్గర దీనికి ఒక మణి ఉంది ఇది వేరే ఏ మణి ప్రకాశించలేదు.అంత గొప్ప మణి ఉంది. దీనిని నీకు పాదాల వద్ద సమర్పిస్తున్నాను స్వీకరించవలసింది అని ఆ మణిని సమర్పించబోయాడు..... అప్పుడు బభ్రువాహనుడు వారిస్తూ వైశ్య కులభూషణా పుణ్య కార్యాలు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలిగొందిన వాడివి రాజునైన నేను ఇవ్వాల్సిన వాడ్ని!!! నా చెయ్యి పైన ఉండాలి,అట్టి నేను నీకు కర్మ చేయు నిమిత్తము,ఈ రత్నాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నావా??? దీనికి ఆశించను,కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు!!! అసలు నీకు ఈ ప్రేత జసన్మా ఎట్లా సంప్రాప్తితించిందో చెప్పినట్లే ఇంకా ఏ ఇతర కారణాల వలన అయిన ప్రేత జన్మ కలిగే అవకాశం ఉందా??? ఒకవేళ పొందితే అందులో నుండి విముక్తి కై ఏం చేయాల్సి ఉంటుంది??? అని అడిగాడు.
ఏ విధంగా ఐతే ఏం??? ౼ ప్రేత జన్మ పొందినవారు ఉద్ధరించాలి అంటే ఓ మహారాజా అవస్యముగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రాహం గా ఆ విధానం ఈ విధంగా ఉంటుంది........ ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీ మన్నారాయణుడు ప్రతిమని శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖ చక్ర పీతాంబర సహితం గా ఆ బంగారు రేకు పై చిత్రించి, అట్లే ఇంద్రుడు బ్రహ్మ,రుద్రుడు మొదలైన వారి ప్రతిమతో పాటు మంటపం పైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి వృషోత్సర్జన క్రియ నిర్వహించి, ఆ తరువాత పదమూడు మంది బ్రాహ్మణులని రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, గోదానం మొదలైనవి అతిశయంగా (షోడశ మహాదానాలు) జరిపించాలి. వారికి మృష్టాన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం,సయ్య దానం వంటివి చెయ్యాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేత జన్మ పొందినప్పటికి కూడా వారు ముక్తులు అవుతారు అని వైశ్య ప్రముఖుడు వివరించాడు. అప్పుడు బభ్రువాహన ప్రభువుని అతని పరివారం అంతా అక్కడకి వెతుక్కుంటూ అక్కడికి రాగా, ఆ ప్రేత జీవులు మాయమయ్యాయి. రాజు రాజధానికి చేరిన వెంటనే, తాను అడవిలో చూచిన వైశ్యుని ప్రేత జన్మ పోగొట్టడానికి సకల దానధర్మాలు జరిపించాడు. అప్పుడా దేవగుప్తునికి ప్రేతతత్వం వదిలింది. అపార పుణ్య జీవి కనుక నా సాయుధ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ గరుడా!!! పరులు చేసిన శ్రార్ధం వలననే ప్రేతం స్వర్గాధి పుణ్యలోకాలకు పోతుంటే, ఔరస పుత్రుల చేత చేయబడే శ్రార్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యం ఏమి లేదు.....
ఎవరీ ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో, ఆ ఇద్దరు కూడా మహా పాపులు అయినప్పటికీ ప్రేతతత్వం పొందక,స్వర్గాధి  పుణ్య లోకాలకు వెళ్తారు.

Monday, March 11, 2019

శ్రీ గరుడ పురాణం - 6 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-6 వ అధ్యాయము

ఈ మానుష జన్మ ఎంత ఉదాత్తమైనదో, అంతజటిలము. అంతగాను లంపటాల హేతువు. పుణ్యసముపార్జనకు ఎంత అనుకూలంగా ఉందొఇహలోక లంపటాల లో తగుల్కొనడానికి అంతేఅనువుగా ఉన్నది. కారణం......ముందేచెప్పినట్లుగా ఇంద్రియ చాపల్యం. వీటితో జ్ఞానంసముపార్జన చేయడమా??? విషయ వాంఛలకులోబడటమా?? అనేది ఆయా మానవుల విచక్షణమీద - స్వతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధార పడిఉంటుంది ఈ 5 ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలిఅని మనిషి ఆశిస్తున్నాడో దానిని బట్టి అతని పాపపుణ్య కార్యాలు ఉంటాయి. వీటిని- జయించిభ్రమలకు లోను కాకుండా జీవితం గడుపు వారికిస్వర్గం తధ్యం ఇంద్రియాలు నిరంతరం భ్రమలకు గురిచేస్తుంటాయి అనడానికి కొన్ని ఉదాహరణలు భ్రమ ఎలాంటిది అంటే ఒక జింక ఉంది అనుకుందాం!! దాన్ని వలలోవేసుకివడానికి బోయవాడు వేణువు ఊదాడు. అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం ఆ వేణు గానంపట్ల అక్షర్షితమై అలాగే మైమర్చిపోతుంది. అప్పుడాజింక సులభంగా బోయవాడికి పట్టుబడిపోతుంది......ఇక్కడ జరిగేది ఏంటి అంటే.... కృష్ణ జింక తన చెవులని తన ఆధీనంలోఉంచుకోలేకపోయింది. ఆపద కొని తెచ్చుకున్నది.... ఒక గజరాజు ఉన్నాడు బలంలో సాటిరాగలజంతువు ఏది గజరాజుకి లేదు..... కానీ ఎన్నో రెట్లుబలం తక్కువగా ఉన్న మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రాంతంలో పెద్ద గోతులు తీసి పలుచగాఆకులు అలమలు కప్పి ఆ దరిదాపుల్లో ఆడఏనుగు చేత ఘీంకారాలు చేయించాడుఅనుకుందాం.... ఆడ ఏనుగు కోసం వెంపర్లాట లోపడి కన్నుగానక గోతుల్లో పడిపోతుంది ఇక్కడవిష్య వాంఛ వలన ఏనుగు ఇక్కట్ల పాలుఅయ్యింది. స్పర్శ సుఖం కోసం ఆరాటం ఆపదకారకం..... దీపం పురుగులు ఉన్నాయి. దీపాన్ని తాకిమాడిపోతుంటాయి. తేనెటీగలు ఎంతో శ్రమించికూడబెట్టిన తేనె జిహ్వ చాపల్యం కొద్దీ కొంత త్రాగిమత్తులో ఉండగానే వేటగాడు వచ్చి మంటబెట్టివాటిని మట్టు బెట్టి వాటి జిహ్వ చాపల్యంతీరకుండానే తేనె సొంతం చేస్కుంటాడు. మాంసపుముక్కల్ని గాలపు ముల్లుకి గుచ్చి ఆ వాసనకుచేపను ఆక్షర్షింపబడగానే, గాలానికితగులుకునేలాగా ఏర్పాటు చేస్తారు జాలరి. ఇక్కడ చేపలను నాసిక మోసం చేసి ఆపద పాలు చేసింది.

బంగారాన్ని చూసి దీపం పురుగు లాగా ఆపదతెచుకునేవాళ్ళు. కాసుల గలగలలకు లొంగి, దాన్నిఅపహరించాలనే ఆశతో జింకలగా ప్రాణం మీదకితెచుకోగలరు. పరభార్యాల లట్లఆశక్తితో, ఏనుగులగా గోతిలో పడి అధములైనఉత్తములు అనేకులుంటారు. భార్యపుత్రులచేతేనెలగా భావించి అన్ని సమకూర్చితే, వాళ్లే తనకుకాకుండా పోయినప్పుడు తేనెటీగ మాదిరిగావగచేవారున్నారు. అధికారం పదవిఆశించి, చేపలాగా ముల్లుకి చిక్కి విలవిలలాడేవారుఉన్నారు. పదవీ నిర్వహణలో సుఖం ఉందిఅనుకోవడం కూడా భ్రమే!!! గద్దెనెక్కిన వారి పాట్లు- వారికి కలిగే ఆటుపోట్లు అనుభవిస్తే తప్పతెలిసిరాదు బాలుడైనా, యవ్వనం గలవాడు అయిన, వృద్ధుడుఅయిన జరిగిపోయిన రోజులు లెక్కించే యముడు ఒకడున్నాడు అని తెలుసుకోవడం లేదు. లోకాల్లోజనులు పుట్టి - పుట్టి మరణిస్తూనే ఉన్నారు. జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలాజరిగిపోతోందో ఆయువు తీరాక కూడా ప్రాణంఅలానే పోతుంది. కానీ భార్య పుత్రులని విడిచిఅందరూ చూస్తుండగానే మరణిస్తారు. లోకంలో తానొక్కడే ఎవరితోడూ లేకుండా ఎలావస్తున్నాడో - పోయేటప్పుడు కూడా ఎవరి తోడులేకుండా అలానే పోతాడు. మరణించిన వానిదేహాన్ని భూమి పై కట్టె లాగా ఉంచి బంధువులుఅంత హహకారాలతో ఏడుస్తారు.....వాళ్ళు అలాఏడవటం వలన ఏమన్న ప్రయోజనంఉంటుందా??? ఏమి ఉండదు..... ఒకడు తప్పుడు సాక్ష్యాలు చెప్తాడు మరొకడుతప్పుడు లెక్కలు చూపిస్తాడు. ఇంకొకడు చెడుత్రోవలో నడుస్తాడు. అలానే కొందరు హత్యలుచేస్తారు. వారివరసలు లేకుండా స్త్రీ పొందకోరుతారు. అనెన్నో పాపాలు చేసి ధనం.పోగు చేసిఅది చూసుకుని మురిసిపోతారు.... ఇంద్రియ భోగాలకు బలీయమైనప్పుడు మనుషులుఈ జన్మను వ్యర్థంగా చెడగొట్టుకున్న వారుఅవుతారు. ఇంతకంటే మూఢుడు ఇంకొకడుఉండదు కదా..... అన్ని జన్మలో మానవ జన్మదుర్లభమైన జన్మ అతడు తన చేతిలో ఉన్నఅమృత భాండాన్ని తానే జారవిడుచుకునివెర్రివాడితో సమానం అవుతాడు తరువాత వార్ధక్యాన్ని పొంది, రోగాలతోబాధపడుతూ మృతి చెంది నరకాలకి పోతాడు. ఇట్లాగే గతా గతముల చేత పాపాత్ములు కర్మబద్ధులైఎన్నటికీ వైరాగ్యం పొందక సంసారంలో పడి మునిగితేలుతూ దుఃఖిస్తుంటారు. పాపులు నరకానికి వెళ్లే విధానం వివరించబడిందిగరుడ!!!! మరల ఇంకేమి వినగోరుతావు??? అనిశ్రీహరి అడుగగా జీవుడు పిండ శరీరాకృతి పొందేవిధానం చెప్పామన్నాడు గరుత్మంతుడు.
సశేషం......గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు... వైరాగ్యంకాదు ఇది వాస్తవం.... భ్రమ ఎలాంటిది? అతిదుర్లభమైన మానవ జన్మ ఎత్తి మనిషి ఏ విధంగాపాపి అవుతున్నాడు????

Sunday, March 10, 2019

శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము

గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలు...శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఉపదేశించిన అత్యంత రహస్యమైన విషయం ఏమిటి??... దానానికి ఎటువంటి ధనం పనికొస్తుంది??? పరమపథం పొందడం ఎలా?? మరణాంతరం జీవుడు తో పాటు వెంట వచ్చేవి ఏవి??? మరణించిన జీవుడు నరకం లో ఏమని అక్రందనలు చేస్తాడు?? ఏ ఏ పాపాలు చేసి ఆర్జించినా, వాటి ఫలితంగా వచ్చే నరకం నుండి ఆ సంపాద పరుడ్ని ఎవరు తప్పించలేరు. వాటి అన్నిటికి అతడు ఒక్కడే బాధ్యుడు. సరే!!! ఇంత మోహం౼మొసంతో సంపాదించిన ధనం ఏమైనా వెంట వస్తుందా?? అది రాదు. బంధువులు మొదలైన వారు,శవం తో శ్మశాననికి పోయి, మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు. దీని బట్టి ఏమి తేటతెల్లం అవుతోంది??? కేవలం ఆ జీవి చేసిన పాప కర్మలు మాత్రమే అతని వెంట రాగలవు. దానం ఇచ్చిన సొమ్ము అనుభవించడానికి అతను అధికారి కాబోడు. పూర్వ జన్మలో చేసిన దానధర్మాలు చేసినప్పుడే, ఇప్పటి భాగ్యం సిద్దిస్తోంది అని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని భాగ్యశాలి గా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో, వారే ధర్మార్ధ కామ మోక్షలకు అర్హులు. ఇచ్చే దానం అయిన భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి. దాన ధర్మాలు చెయ్యడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపచేసుకోవచ్చు... భక్తితో చేసిన ధర్మం అణువుమాత్రమైనా మేరువుతో సమానం ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దానాధర్మలకి వెచ్చించే ద్రవ్యం న్యాయ్యంగా ఆర్జించినదై ఉండాలి. అన్యాయం గా ఆర్జించిన ధనం దాన ధర్మలకు ఉపయోగపడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫల రహితము అవుతుంది. ఆశించిన ఫలితం ఇవ్వదు. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన ధనం, దానం చేస్తే లేదా భాగవాదర్పణ చేస్తే పుణ్యం లభించదు సరికదా..... మరింత పాప హేతువు కాగలదు. నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారములు/కార్య కాలాపములు వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడటం అవివేకం అనిపిస్తుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవుల్ని హింసించక పోవడం - వారిని పీడించి ధనం ఆర్జించకపోవడం విశేష పుణ్యదాయకం….

నా పరమపథం పొందడానికి బ్రహ్మ, దేవేంద్రులాదులకే దుర్లభం. అటువంటిది కేవలం మనః శుద్ధి - విత్త శుద్దితో చిన్న దానం చేసినా ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను. గరుడా!!! అందుకే ఇది అతి రహస్యమైనది - పాపాత్ములకి అర్ధం కానిది అని నీకు మొదటే చెప్పి ఉన్నాను.. కనుక భక్తి శ్రద్ధలతో దానధర్మాలు చేసే వారంతా మొట్ట మొదట తాము ఆర్జించిన ధనము సమ్మతమైన ద్రవ్యమా??? పరపీడన ద్వారా పోగు చేసినట్టి ద్రవ్యమా??? అని ఎవరికి వారే జాగరూకులై గమనించుకోవాలి. స్వార్జితం ధర్మ సమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చెయ్యాలి అని వక్కాణించాడు శ్రీ హరి పదవ రోజున ఏర్పడిన పిండ దేహాన్ని పదమూడో రోజున కింకారులు లాక్కుని పోయే తీరు ఎలా ఉంటుంది అంటే....రాను రాను అంటూ మొరాయించే కోతిని తాడుకి కట్టి ఈడ్చుకుని వెళ్తున్నట్లు ఉంటుంది. అయ్యయ్యో!!! నాకేది దారి??? నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే!!! ఎం చెయ్యను??? ఈ నరకం బాధ తప్పించుకునేది ఎట్లు?? బ్రతికి ఉన్నప్పుడు మేలుకోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేసానే.... సర్వేశ్వరుడు ఉన్నాడు అని, సత్కర్మలుకి స్వర్గఫలం / దుష్కర్మలకు నరక ఫలం తప్పదని..... దుర్మార్గం వదిలి సన్మార్గం లో నడవాల్సింది అని వాళ్ళు చెప్పే హితోక్తులు పెడచెవిన పెట్టానే.... ఇప్పుడు ఇక్కడ యమకింకరులు పార్వతాలంతేసి సమ్మెటలతో ఇనుప గదలతో బాదుతున్నారే!!! అబ్బాబ్బా!!! ఈ బాధ భరింపశక్యం గా ఉంది.... అయ్యాయో!!!! పెద్దలకు ఏ ఉపకారాన్ని చెయ్యలేదు. కనీసం చేసేవాడికి అయిన తోడ్పడలేదు. తీర్థయాత్రలు చెయ్యలేకపోయాను. చేసేవారిని ప్రశంసించలేక పోయాను. మేలైన పూజలు, అర్చనలు నిర్వహించలేక పోయాను సరి కదా..... కనీసం చేసేవారికి పరిచర్యలు అయిన చెయ్యలేదు... నీళ్లు లేని చోట్ల చాలివేంద్రాలు ఏర్పరిచి ఉన్న బాగుండేది. ఒక చెరువునో - నూతినో ప్రోజపయోగం కోసం త్రవ్వించగలిగానా???? మొత్తం నా భూమి అంతటితో పైరు వేసుకుని అంతా నా స్వార్ధానికి వాడుకున్నాను..... అందులో కాస్త అయిన పచ్చిక కోసం పశువుల నిమిత్తం వదలక పోతిని. సాధమైనంతలో నిత్యం చిన్న దానం అయిన చేయాకపోతిని వేద శాస్త్రాలు అభ్యసించగల నేర్పు - ఓపిక లేకున్నా కనీసం శ్రీ మద్రామాయణ భారత భాగవతాలను స్వహస్తం తో రాయడమో - ఆ గాధలు వినడమో చేయలేకపోయాను. వ్రాయించడమో - కనీసం అమ్మకానికి చదవగల ఆశ గలవారికి ఇప్పించలేక పోయాను. చదవడమో - చదివించడమో చేసి ఉంటే బాగుండేది ఆహా ఏమి నా దౌర్భాగ్యం!!! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను. కనీసం కలలో కూడా ఒక్కటంటే ఒక్కటి సత్కార్యం ఆచరించలేకపోయాను..... పైగా చెడు పనులలో ఏ. ఒక్కటి విడిచిపెట్టలేదు.....మహా పాపి అయిన నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంటే ఎంత విచారించి ఎం.ప్రయోజనం???? అని పరిపరి విధాలుగా ఏడుస్తూ - కింకరుల ఆదలింపులకి భీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తూ ఉంటాడు అని శ్రీమన్నారాయణుడు తన భక్తుడు ఖగపతికి యమమార్గం ఎంత కఠినమో వివరించాడు 5వ అధ్యాయము సమాప్తం

రేపు 6 వ భాగము చదువుకుందాము

Wednesday, March 6, 2019

Advance National Women’s Day


Advance National Women’s Day

Advance National Women’s Day

Advance Happy Women’s Day quotes. International Women’s Day or IWD is remembered all around the world every March 8. It’s also celebrated on August 9th each year in South Africa under the name National Women’s Day as a public holiday. It is the celebration of the achievements of women all over the planet for their achievements in all aspects of society and civilization including social, economic, cultural and political arenas.
In some countries, IWD is celebrated as a day of appreciation much like Mother’s Day. For other countries, however, International Women’s Day is a day which highlights the political and human rights struggles of women worldwide. Wherever in the world you may be living, hopes that you live in a country where women are able to live to their full potential in happiness and health. Share these Happy Women’s Day quotes and greet all the important and beloved women in your life.

Tuesday, March 5, 2019

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము


యమలోక మార్గ వివరణ,ఆ మార్గం ఎలా ఉంటుంది?యమభటులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ కర్తవ్యం ఏమిటి?పాపాత్ములకి విధించే శిక్షలు ఏంటి?

నరలోకనికి, నరకలోకానికి 86000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8600 క్రోసుల దూరం అని చెప్పవచ్చు. ఈ నాటి కొలమానం ఐతే దాదాపు 68800 మైళ్ళ దూరం. ఆలోకంలోనే యమధర్మ రాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్హు తీరినవారిని పట్టుకుని రావడానికి పంపే నిమిత్తం ఒక్కో జీవికి (ముగ్గురు చొప్పున) అసంఖ్యంగా భటులు ఉంటారు.వారి రూపమెంతో భీకరం. భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నినే దహించగలిగినంత కోపం, కారు మేఘాల్లాంటి నల్లటి వస్త్రాల ఆచ్ఛాదన,పాశం, ముసలం (రోకలి) వంటి ఆయుధధారణ వారి స్వంతం. ఆయువు తీరిన జీవిని పట్టి, వాయురూప దేహం కల్పించి,యమధర్మరాజు ఎదుట ప్రవేశ పెట్టడమే వారి విధి నిర్వహణ యమకింకరులు పాశం పట్టి లాగుతుండగా, అతి సుధీర్గము,అతి కఠినం అయిన యమలోకం మార్గంలో నానాక్లేసాలు అనుభవిస్తూ జీవుడు నడవాల్సి ఉంటుంది. మృతి చెందిన వెంటనే౼తృటిలో యమకింకరులు యమసధనమున ప్రవేశ పెట్టిన ఆ మార్గమే ఇప్పుడు జీవుడు అధిగమించాలి. రేయింబవళ్లు నడవాలి. యమకింకరులకు దయా దాక్షిణ్యాలు ఉండవు.మార్గంలో కఠినమైన అవరోధాలు ఉన్న వారు ఈడ్చుకుంటూ,దండించుకుంటూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో ౼మొనదేలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు గల్గిన దట్టమైన చెట్లు నిండిన "అసిపత్రవనం" అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్ని ఒకటి ఒరుసుకుని, ముందుకు చొచ్చుకొని వచ్చినట్లు చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికి అక్కడే చెల్చేస్తూ, రక్తధారలు స్రవింపజేస్తుంటాయి.

యమభటులు ఏం చేస్తుంటారు

ఆయువు ముగిసినవారిని పట్టి, వాయుశరీరం లోకి ప్రవేశ పెట్టి,తమ ప్రభువైన యమధర్మ రాజు ముందు నిలిపి. పశాండధరా!!! మీ ఉత్తర్వు ప్రకారం ఆయుష్హు తీరినవారిని,మీ సన్నిధిని ప్రవేశ పెడుతున్నాము. ఇక మేము చేయవల్సింది ఏమిటో శెలవు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మహిష వాహనుడు అయిన యమధర్మరాజు "కింకరులరా! మంచిది. ఈ జీవుని 13 దినమున నా దగ్గరకు రండి" అని చెప్పడంతో దూతలు ఆజ్ఞ పాటించి,క్షణంలో ఆ జీవుని తెచ్చి నరలోకంలో అతని నివాసం వద్ద విడుస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళిరావాల్సిన వాడు కావడం వల్ల, మృతి చెందిన తక్షణమే దహనం చెయ్యరు.యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుడు కి ఇంకా భూమ్మీద వాసయోగ్యత ఉందేమో అని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలిదప్పులు తీరే అవకాశమే లేదు. నెల చదునుగా ఉండటం వలన పాదాలు బొబ్బలు ఎక్కుతాయి. అరికాళ్ళకి గుచ్చుకునే ముళ్లకు అంతు ఉండదు.రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్నా.....యమభటులకి జాలి కలగదు. వారు అదిలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిందశరీరం పడే యాతన. ఇక౼ యమపురిలో ప్రవేసించన వెనుక పడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోరపాపుల నిలయం.ఎటు చూసినా నరక బాధలు అనుభవించే హాహాకారాలు మిన్నంటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ (ఎండమావులు) నీరు ఉన్నట్లే కనిపిస్తుంది కానీ ఎంత దూరం పరుగులు పెట్టినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేది ఉండదు

పాపాత్ములకి విధించే శిక్షలు.

పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రత బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రొకళ్ళతో దంచుతారు. కొందరిని ఆయుధాలతో తిరుగుతారు.మారికొందరిని కత్తి తో నున్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు. ఇంకా కొందరిని గానుగల్లో వేసి తిప్పుతారు. వ్యభిచారం అనే మహా పాపానికి విధించే శిక్ష మరింత క్రూరంగా ఉంటుంది. రాగితో తయారు అయిన రెండు విగ్రహాలు (ఒకటి పురుషుడిది, ఒకటి స్త్రీ ది) ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణికల్లా మెరుస్తూ ఉంటాయి.ఇతరుల భార్యల్ని వాంఛించ వారికి కాలుతున్న స్త్రీ విగ్రహాన్ని, పురుషులతో సంగమించిన దానిని కాలుతున్న పురుష విగ్రహాన్ని జతచేసి బలవంతంగా కౌగలింప చేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తేనే మూర్ఛపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి, ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింపజేస్తారు. ఇంతకంటే పరసతులని/పారపురుషులని వాంఛిపకుండా ఉండటంమేలు కదా

Sunday, March 3, 2019

శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము


నిన్నటి భాగం తరువాయి
యమధర్మ రాజు పాపుల్ని శిక్షించమని ఆజ్ఞాపించుట....యమదూతలు శిక్షలు అమలు చేయడం.

నిష్చేష్టులై ఉన్న ఆ పాపుల్ని చూసిన యముడు "వారి పాపాలకి తగిన శిక్ష అనుభవింప చేయండి" అని భటులని ఆజ్ఞాపిస్తాడు. చండుదు౼ప్రచండుడు మొదలైన దూతలు నిర్ధయాత్ములై,పాపుల్ని అందరిని ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకి తీస్కునిపోతారు. అక్కడే ఒక పెద్ద వృక్షము కలదు. అది ఐదు యోజనముల వెడల్పు౼ఒక యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపుల్ని తలక్రిందులుగా కట్టి౼కొట్టుదురు.ఆ భాదలని భరించలేక దుఃఖిస్తూ౼ పాపుల్ని రక్షించే వాడు అక్కడ ఉండదు. ఇలా వేలాడుతున్న పాపులు ౼ యమభటులని అనేక విధంగా ప్రార్ధిస్తారు. యమభటులు ౼ వివిధ ఆయుధములు తో వారిని కొడతారు. పాపాత్ములరా!!! పాపకార్యములు అనేకం చేసిరి..... పితృదేవతలకు తర్పణం ఇయ్యలేదు౼పెద్దలని గౌరవించలేదు౼సులభమైన జలము అన్నము ఎవరికి పెట్టలేదు౼కాకులకి, కుక్కలకి ఏమియును పెట్టలేదు౼అతిథుల్ని ఆదరింపలేదు౼దేవతల్ని అర్చింపలేదు౼ఇట్టి మిమ్ము ఆ శ్రీహరి మాత్రమే క్షమించగలడు. మేము అతని ఆజ్ఞచే౼మీ పాపములకు తగినట్లు శిక్షిస్తున్నాం౼అని అనేక విధముగా పాపుల్ని కొట్టేదరు౼కుక్కలచే కరిపించుదురు. వివిధ ఆయుధములచే చీల్చి ౼ మరుగుచున్న నూనె లో వేసి ౼ అనేక విధములు గా శిక్షిస్తారు. తరువాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిస్రము అనే నరకంలో పడేస్తారు అని శ్రీ హరి గరుత్మంతునికి వివరించాడు ఆ పిదప, ఖగరాజు సర్వలోక పూజ్యుడు అయిన శ్రీ హరికి నమస్కరించి "ఓ కరుణానిధి! నరకములు ఎన్ని? వారి స్వరూపం ఎట్టిది?అందులో బాధలు చెందే వారి దుర్దసలు ఏంటి? సవివరంగా నాకు వివరించండి" అని అనగా శ్రీ మహావిష్ణువు ఈ విధముగా సెలవు ఇచ్చాడు

నానారకముల నరకాలు:-
ఓ ఖాగరాజ!గరుడా! నరకములు ఇన్ని అన్ని అని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవి అగణితం గా ఉన్నాయి. మానవుని చిత్త ప్రవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉంటే వాటి అన్నింటికీ సంబంధించిన నరకాలు చవిచూడాల్సి వస్తుంది.కనుక అవి అసంఖ్యంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. కానీ నీవంటి జ్ఞానికి ఆ సంఖ్య రేణమాత్రంగా అయిన గోచరించడానికి 84 లక్షల నరకాలు ఉన్నాయి.జీవుల సంఖ్యకు ఇవి సరిసమానం అనుకో....
వీటిలో కూడా ఘోరతిఘోరమైన నరకాలు 21
వైతరణీ కి చేరువగా సారమేయోదనము కూడా చేర్చవచ్చును. ఈ నరకాలకు చేరువలో ఐదు ఆమడల విస్తీర్ణం ఒక యోజనము ఎత్తు కలిగిన ఒక బూరుగ వృక్షం అగ్నిహోత్రం లాగా వెలుగుతూ ఉంటుంది.పాపాత్ములు అందరిని ఆ చెట్టుకు తలక్రిందులు గా కట్టి యమదూతలు కొడుతూ ఉంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవరూ ఉండరు.యమదూతల చేత వారు హింసించబడుతూనే "వారేమి పుణ్యకార్యలు చేయలేదో ఆ పుణ్యకార్యాల చిట్టాని యమభటులు చెప్తుండగా వింటారు. కొందరు పాపులు దెబ్బలకి ఓర్వలేక గిలాగిలలాడి పడిపోతారు.అలా పడేటప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకుపోయి వారి శరీరం తెగిపోతూ ఉంటుంది. కిందపడిన వారిని కుక్కలు కరుస్తాయి. ఈ పాపులలో కొందరిని భటులు రంపాలతో కోస్తారు. కొందర్ని గొడ్డళ్లతో నరుకుతారు. కొందరిని సలసల కాగే నూనెలోకి పడేసి వేపుతూ ఉంటారు.కొందర్ని నిప్పుల్లో కాల్చి సమ్మెటల్తో సాగకొడతారు.కొందర్ని నూతుల్లోకి తోస్తారు. కొందరిని శిఖరాలు నుండి కిందకి దొర్లిస్తారు.కొందరిని గానుగల్లో ఆడించినట్లు తిప్పుతూ ఉంటారు. కొందర్ని పురుగుల గుంటలోకి తోస్తారు వజ్రపు ముక్క గల కాకులు౼గ్రద్దలు వల్ల ఆ పాపులు పడే హింస వర్ణనాతీతం
21 అతిఘోర నరకాలు ఇవి.

1.తమిస్రము
2.అంధ తమిస్రము
3. రౌరవం
4. మహారౌరవం
5.కుంభీపాకము
6.సూచీముఖం
7.అసిపత్రవనము
8.అవీచి
9.అంధకూపము
10.వైతరణీ
11.పుయోధ
12. కృమిభోజనం
13. ప్రాణరోధ
14.కాలసూత్రము
15.సందర్శము
16. తప్తోర్మీ
17.వజ్రకంటకం
18. శాల్మలి
19. వినాశము
20. నానాభక్షణము
21.రేతః పానము
సశేషం
రేపు  అతిఘోరమైన నరకాల వివరణ ఏ ఏ పాపానికి ఆ నరకం అలానే దాంట్లో విధించే శిక్షలు  తెలుసుకుందాము.

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');