Sunday, January 27, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

గరుడుని పుట్టుక


1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు. గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు. (గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.


2 . పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది. పితృ  వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని, తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .

3 . భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి. ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .

4 . మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు) జరుగునపుడు యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .

5 .బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట , లేదా ! అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును. శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను, సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. " అహరహ స్సంధ్యా ముపాసీత " అని పెద్దల యాదేశము. శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .

దానములు - ధర్మములు

దానములు వేరు, ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది . ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు, మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట, దేవాలయ నిర్మాణము, ఉద్యానవనములు, పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము, తపస్సు, సత్య వ్రతము, వేదాధ్యయనము, అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.

సూర్య, చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును.

మహాదానములు పది 

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు,దాసీ జనము, రధములు, భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి. ఇవి పది. దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును. ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును. వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు

ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము. అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించినది, దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి. ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు. అంతే కాదు; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి. గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువు

రెండవ ద్వాపరములో                                                      ప్రజాపతి
మూడవ ద్వాపరములో                                                   ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో                                                  బృహస్పతి
ఐదవ ద్వాపరములో                                                       సవితృడు
ఆరవ ద్వాపరములో                                                       మృత్యువు
ఏడవ ద్వాపరములో                                                       ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో                                                వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో                                                సారస్వతుడు
పదవ ద్వాపరములో                                                       త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో                                           త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో                                               శత తేజుడు
పదమూడవ ద్వాపరములో                                            ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో                                          తరక్షుడు
పదునైదవ ద్వాపరములో                                                త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో                                               ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో                                                కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో                                         ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో                                            భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో                                                 గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో                                          రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో                                         శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో                                       తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో                                      వాల్మీకి
ఇరువది ఐదవ ద్వాపరములో                                           శక్తి
ఇరువది యారవ ద్వాపరములో                                        పరాశరుడు
ఇరువది యేడవ ద్వాపరములో                                         జాతూకర్ణుడు
ఇరువది ఎనిమిదవ ద్వాపరములో                                    కృష్ణ ద్వైపాయనుడు

ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .

Saturday, January 26, 2019

26th JANUARY REPUBLIC DAY 70th meghala technologies

26th JANUARY REPUBLIC DAY

Republic Day

India celebrates the Republic Day every year on the 26th of January since 1950 when Constitution of India came into force. Republic Day in India is of great importance in the history as it tells us all about each and every struggle of Indian freedom. People who were fighting for Independence of India took a pledge on the same day in 1930 at the banks of River Ravi in Lahore to achieve a complete independence (Poorna Swarajya) of India, which came true in the year 1947 on 15th of August.

Thursday, January 24, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

" మనెను. దానికి గరుడుడు " నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును." అనెను . " ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె, నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే, అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను. దీనికి నీవంగీకరింపుము" అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి, " మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !" అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.

ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి," కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు." అని చెప్పెను. తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై "గరుడా ! నీ భక్తికి మెచ్చినాను. నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము." అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.

 గరుడుని గర్వ భంగము

ఒకప్పుడు గరుత్మంతునికి, తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట, ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది . ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.

ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి. విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను. గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను. సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.

శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను. గరుడుడా స్పర్శతో తేరుకుని, విష్ణు మూర్తి పాదములపై బడి," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి, నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను. శ్రీ హరి ప్రసన్నుడయ్యెను 

నవగ్రహములు - రత్నములు

సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను, మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .

1 .సూర్యుడు -- పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు -- ముత్యము
3 .అంగారకుడు - పగడము
4 .బుధుడు -- ఆకుపచ్చ
5 .గురుడు --పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు --వజ్రము
7 .శని -- నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు - గోమేధికము
9 . కేతువు -- వైడూర్యము
పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను. ఈ యజ్ఞములు ఐదు .1 . దేవ యజ్ఞము  2 . పిత్రు యజ్ఞము  3 . భూత యజ్ఞము  4 . మనుష్య యజ్ఞము 5 . బ్రహ్మ యజ్ఞము .

Wednesday, January 23, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను. ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి. అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు.
ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను. అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశముగాను అయ్యెను. ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను. అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా "తప తప "అను మాటలు విన వచ్చెను. అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను.

బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని, దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి, వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి, మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు.

కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత , కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె, గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను. ఆమె సంతోష భరితురాలయ్యేను.

ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ, వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ "గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న " దనెను. వినత " అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?" అనెను. కద్రువ , "కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను. తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను " అనెను. వినత " అయినచో పోయి చూతము రమ్మ "నెను. కద్రువ " ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.

 రేపు ప్రొద్దున చూత" మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి, "మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా  కనబడునట్లు చేయు " డనెను. "విషయమే" మని వారడుగగా, జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి. ఆమె వారిని సర్పయాగాములో నశింపు చేసెను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది. తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు. ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి," మనకీ దురవస్థయే" మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి " ఏమిచ్చినచో నీవు నా తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద " నని యడిగెను. ఆమె " దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు " ననెను.

గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి, తన తల్లి దాస్యమును, దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి, ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను. కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి, అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి. వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో " దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు

Tuesday, January 22, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

పరిచయము : గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు, ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది. కాని అది సరియైనది కాదు. ఇది, విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము. నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .

గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను, అతని చరిత్రమును, పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది. అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి. అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి, వారు చేసిన ప్రతి సృష్టి, వంశములు, మన్వంతరములు, వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి. యుగ ధర్మములు, పూజావిదానములు విష్ణుని దశావతారములు, అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు, చంద శ్శాస్త్ర ప్రశంశ, వ్యాకరణము, గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి. ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి. ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును. చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే. నైమిశారణ్యము లోని  శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా, వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

Monday, January 14, 2019

తిరుప్పావై ముప్పయివ 30 పాశురం

తిరుప్పావై  ముప్పయివ 30 పాశురం

తిరుప్పావై  ముప్పయివ 30 పాశురం

        వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై
        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ
        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై
        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న
        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే
        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్
        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్
        అణ్దాల్ తిరువడిగళే శరణమ్

భావం
       ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు. వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది. ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
        *శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్*   
        *శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్*

    అవతారిక 
ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన (మాలిక). ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ 'తిరుప్పావై' దివ్య ప్రపందాన్ని అనుసంధించి మనమూ తరిద్దా౦! అమ్మా ఋణాన్ని తీర్చుకొందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం!
        *(శంకరాభరణము _ ఝుంపెతాళము)*

    ప.     శ్రీసూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడ సుమ మాలిక!
    అ..ప..    పాశురపు పేటిక ముప్పుదుల కానుక!
        ఆశువుగ గోదపాడిన గీతమాలిక!
 
    1. చ..    పాలకడలిక ఓడలున్నను సురలకై
        లీలగ మధించిన కేశువుని జేరి
        గొల్లెతలు చంద్రముఖులా యలంకృతులు
        నల్లనయ్యకు కృపా పాత్రులైన విధమ్ము
        ఉల్లమలరగ గోద గీతముల పాడినది
        శ్రీ సూక్తి మాలిక......

    2.చ..    ఈ పాశురమ్ములను ముప్పదిని విడువక
        గోపాల సన్నిధిని నిత్యమనుసధింప
        గోపదేవుని పూర్ణా కృపగల్గు గాక! యని
        గోపతిని కొలిచిన విష్ణుచిత్తుని తనయ
        శ్రీ పాదములే మనకు శరణమని చూపినది.
        శ్రీ సూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడమును మాలిక!

    *(పుష్పములతో ఈ క్రింది కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమును పుష్పమును చూపిస్తూ దానియందు ప్రేమనింపి అర్చన చేయాలి)*

ఓం   కేశవాయ నమః             ఓం వాసుదేవాయ నమః
ఓం   నారాయణాయ నమః      ఓం ప్రధ్యుమ్నాయ నమః
ఓం  మాధవాయ నమః           ఓం అనిరుద్దాయ నమః
ఓం  గోవిన్డాయ నమః              ఓం పురుషోత్తమాయ నమః
ఓం విష్ణువే నమః                   ఓం అధోక్షజాయ నమః
ఓం మధుసూదనాయ నమః    ఓం నారసింహియ నమః
ఓం  త్రివిక్రమాయ నమః          ఓం అచ్యుతాయ నమః
ఓం వామనాయ నమః            ఓం జనార్దనాయ నమః
ఓం శ్రీ ధరాయ నమః               ఓం ఉపేంద్రాయ నమః
ఓం హృషీకేశాయ నమః           ఓం హరయే నమః
ఓం పద్మనాభాయ నమః          ఓం శ్రీ కృపాయ నమః
ఓం దామోదరాయ నమః          ఓం  సంకర్షణాయ నమః

Sunday, January 13, 2019

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ 29 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ 29
రోజు పాశురం


తిరుప్పావై రేపటి ఇరవై తొమ్మిదవ 29 రోజు పాశురం
        శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్    
        పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;
        పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,
        కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు; 
        ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:
        ఎత్తైక్కు  మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
        డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,
        మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్

భావం

ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది. 

   అవతారిక 

భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు.

(ధర్మవతిరాగము _ అదితాళము)
       
     ప...    నీ సన్నిధియే కావలె స్వామీ!
        నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ!
    అ..ప..    నీ సేవకై వేకువజామున నిలిచి
        నీ సుందర తిరువడులకు మంగళమనగ
     
    చ..     పనుల మేపి జీవిక నడిపెడి మా 
        పశుప కులమునన్ బుట్టిన స్వామీ!
        ఈశ ! మా అంతరంగ సేవలను
        ఆశల జేయ నిరాకరింపకుమ!
        నీ సన్నిధియే కావలె స్వామీ!

    చ..    కాదుసుమా! వాద్యముకై వ్రతము     
        అదియొక నేపమగు నోచ నీ వ్రతము
        బంధము వీడక యేడేడు జన్మల
        అందరము కై౦కర్యము చేతుము
        విందువో గోవిందా! మనవిని __ మా
        యందన్య కామనలను పోగొట్టుము.

Saturday, January 12, 2019

తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు పాశురం


తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు పాశురం

    కఱవై పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్ 
    అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై
     ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
    కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు
    ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు
    అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?
   శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్

భావం

ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.

    అవతారిక

గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కాని వారి అంతరంగమందున్న కోరిక ఆముష్మిక మైనదని స్వామికి తెలియును 'నీకు మాకును వున్న సంబంధమే! మేమజ్ఞానులము. మేము నిన్నుగాని, నీవు మమ్ములనుగాని విడిచి వుండలేని బంధమే అర్హత' అని విన్నవించారీ పాశురంలో.

        కమానురాగము రూపకతాళము

    ప...    ప్రేమతో చిరునామమున నిన్ను పిలిచినామని
        స్వామీ! గోవింద ! అలగబోకుమా! కణ్ణా!
    అ..ప..    ఏమీ! తెలియని వారము స్వామీ!
        మము కృపజూడర! గొల్ల పడుచులము
        స్వామీ! గోవింద! అలగబోకుమా! కణ్ణా!

    చ ...    ఎంతటి పుణ్యమొ నీ అవతారము
        వింత గద! గొల్లకులమున ప్రభవము!
        ఎంత త్రేంచినను తెగనీది బంధము
        ఎంత ధన్యమీ గోపికా కులము!
        స్వామీ! గోవింద! అలగాబొకుమా! కణ్ణా!

    2చ..    కోపింపకుమా! కృష్ణ ! కృపాకర!
        కృపాజేయును వాద్య విశేషము త్వర!
        గోపికలము మే మజ్ఞానులము
        మేవుచు పశువులను బ్రతికెడివారము
        స్వామీ! గోవింద! అలగాబోకుమా! కణ్ణా!

Friday, January 11, 2019

తిరుప్పావై ఇరవై ఏడవ 27 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై ఏడవ 27 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై ఏడవ 27 రోజు పాశురం

           కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై
        ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్        
        నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక
        శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ
  యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్ 
        అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు
        మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

భావం

   నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లేsvl!

  అవతారిక

స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.
         (హంసద్వనిరాగము _ అదితాళము)

    ప ...     అనాశ్రిత విజయ! శుభ, గుణదామా!
        నిను సుత్తియించి ప్రాప్యము నొంది    
    అ..ప..    నిను సుత్తియించి ప్రాప్యము నొంది.
        సన్మానమంది సన్నుతి జేతుము 
    
    చ..    కంకణమ్ములను భుజకీర్తులను
        కర్ణ భూషలును కర్ణ పుష్పములు 
        మెరుగుటందియలు మేని తోడవులును 
        పరవశత నలంకరించుకొందుము
    చ..     మేలిమి పలువల మేము ధరించి 
        పాలు నేయి గలసిన పరమాన్నము        
        కేలోడ మనము కలసి భుజియించి
        ఇల నీ సంశ్లేషమున సుఖింతుము

Thursday, January 10, 2019

తిరుప్పావై ఇరవై ఆరవ 26 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై ఆరవ 26 రోజు పాశురం
తిరుప్పావై ఇరవై ఆరవ 26 రోజు పాశురం

        మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;
        మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;
        ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన
        పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,
        శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,
        కోలవిళక్కై, కోడియే, వితానమే,
        ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్

భావం

ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు __ సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పఱవంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తీయగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము.

 అవతారిక

ఉపాయము, ఫలము _ రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని సుత్తించి, కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. వ్రేపల్లెలోని పెద్దల కోరికమేరకు యీ మార్గ శీర్షవ్రతాన్ని వర్షాలు కురియటంకోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం. కానీ గోపికల వ్రతఫలం మాత్రం __ శ్రీకృష్ణ సమాగమమే! మార్గశీర్ష స్నానమనగా __ నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్ధం ఇలా చేసే యీ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు యీ (ప్రాశురంలో) కోరుతున్నారు. 
     
 (అమృతవర్షిణి _ అదితాళము)
 
    ప....    ఆశ్రితవత్సల ! నీల శరీరా!
        ఆశ్రితులమురా! కృపజేయుమురా!
    అ..ప..    ఆశ్రయించితిమి వటపత్రశాయి!
        ఆశ్రితర్డాముల నవధరించరా!

1.     చ..    లోకములదరగ ఘోషించేడి నీ
        శంఖపుసరి వాద్యముల నీయరా!
        మాకోసగిన ఘన వాద్య విశేషము     
        గైకొని మావ్రత మాచరించెదము

2.    చ...    మంగళముల నాలపించువారిని
        మంగళమౌ దీపమ్ము, ద్వజమ్మును
        మంగళకరమౌ వితానమ్మును
        సంగితితో మాకోసగు దేవరా!

Wednesday, January 9, 2019

తిరుప్పావై రేపటి ఇరవై ఐదో 25 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై ఐదో 25 రోజు పాశురం

తిరుప్పావై రేపటి ఇరవై ఐదో  25 రోజు పాశురం

        ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్
        ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,
        తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద
        కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్
        నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
        ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి
        వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావం

ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున   చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.

 అవతారిక

'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయున 'నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి. మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి యీ (పాశురంలో) అర్ధించుచున్నది.

          బిలహరి రాగము _ ఝుంపెతాళము
 
    ప ...    పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!
    అ...ప...    వరలక్ష్మి యాశించు పరమ సంపదనేల్ల
         కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము

    చ...    దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి
        దేవి యశోధకును వరసుతుడవై పేరుగ
        తా విన్న కంసుడట కీడు దులపగ నెంచ
        నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి
        ఆ యత్నమంతము వమ్ముజేసిన స్వామి
        పురుపార్దమర్దింప వచ్చినారము స్వామి
        పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా!

Tuesday, January 8, 2019

తిరుప్పావై ఇరవై నాలుగో 24 రోజు పాశురం

తిరుప్పావై  ఇరవై నాలుగో 24 రోజు పాశురం


        అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;
        చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;
        పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;
        కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;
        వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;
        ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్ 
        ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్
 
☘భావం

అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని. వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక! ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.

   అవతారిక 

ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ! ఆశ్రితులకు కొంగు బంగారమే! గోపికలంతా తన్ను తన తిరుమాళిగనుంచి వీరసింహము వోలె నడిచివచ్చి సింహాసనాన్నదిష్టి౦పమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనపుడు భక్తసులభుడైన స్వామి వారేది చెపితే అదే చేస్తాడుకద! అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు 'అయ్యో! స్వామికెంత శ్రమ కలిగినదో!' అని అందోళనపడి అత్యంత భక్తీ ప్రవత్తులతోను, వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళా శాసనం చేయడానికి సిద్ధపడి, తాము వచ్చిన పనిని మరచిపోయారు. స్వామి దివ్యమంగళ వోగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు యీ (పాశురంలో)

        *(షణ్ముఖప్రియరాగము __ అదితాళము)*

    ప ..     మంగళమగుగాక! జయమంగళం

    అ...ప..    మంగళమగుగాక! శ్రీ పాదములకు
 
1.    చ..    లోకములలనాడు గొలిచిన పదములకు
        లంక గెల్చిన యట్టి రాముధీరతకు
        శకటాసురుని గూల్చు నీ యశః ప్రభలకు
        అకట వత్సాసురుని విసిరినా పడమూలకీల

2.    చ...    గోవర్దనాద్రినిన్ గొడుగుగా నెత్తిన
        అవతారుడ! నీ కృపా రసమునకు
        అవని శాత్రవుల నవలీలగా ద్రుంచు
        దివ్యాయుధమును నిత్య మంగళము 
 
3.    చ....    ఈ విధిన్ మంగళాశాసము జేసి
        నీ వీర గాథలే పాడి. కొనియాడి 
        నీ వోసగు వరములకు నిను జేరితమి నేడు.
        ఆ వాద్య మొసగుమా! దాసుల బ్రోవుమా...

Monday, January 7, 2019

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

    మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్ 
    శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు 
    వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
    మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు
    పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్ 
    కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ 
    శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద 
    కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.

భావం 

వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.

   అవతారిక

    'మమ్మల్ని కటాక్షింపవయ్యా!' అని ఎంత వేడినా పలుకకున్నవానిని చూచి, నీళాదేవి నాశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి 'అయ్యో! వీరినెంత బాధపెట్టితిని . వీరికి ముందుగనే, నేను కావలసినవి యిచ్చి వుండవలసినది. అని ఎంతో కలత చెందాడు, 'నావారినే నేను ఉపేక్షించాను. దినులై అర్ధించేటట్లు చేశాన' ని  ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసులనుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపేట్టినట్లుగానే నేడు యీ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే 'మీకేమికావలె' నని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తున్నాడు. 'మాకే కామనలు లేవు స్వామీ! నీవు నీ భవనము నుండి వచ్చి యీ సింహసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదుమ' నిరి .అదే యీ (పాశురంలో) వర్ణితము.

        అసావేరి రాగము __ అదితాళము

    ప..    రారా! మా స్వామి రారా!
        తీరుగ మముజూచి కృపసేయగ రార!
        రార! మా స్వామి రారా!

    అ.ప..    లేర! శయన గృహమును వీడి రావేర!
        వర సింహసనమును జేర రావేర!
 
    చ....    గిరి గుహల శయనించి మేల్కొను సింహమై _ కే
        సరముల విదిలించి నలుదెసలు పరికించి
        గర్జించి అలసత __ విసర్జించి ఆరుదేరు
        వీర సింహము వోలె వేవేగ రావేర'

    చ..     అతసీ సుమము వంటి తిర మేనుగల స్వామి
        ఈ తడవు నీశయన మందిరము వీడవే!
        పూత సింహాసన మ్మధివసింపగ రావె!
        ఆశ్రితుల మనవి విని కరుణింపగ రావె!

Sunday, January 6, 2019

తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం
తిరుప్పావై ఇరవై రెండో 22 రోజు పాశురం

    అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
    బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే
    శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్
    కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే
    శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;
    తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్ 
    అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్ 
    ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.

భావం

ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 

 అవతారిక 

పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.


        *(కల్యాణిరాగము - రూపక తాళము)*

ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ 
    ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!

అ..ప..సూర్యచంద్రులుదయించెనో u? యట్టుదోచు కనుదోయిని 
    పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!

1. చ..అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ 
    సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల 
    అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము 
    మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి 
    ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!

Saturday, January 5, 2019

తిరుప్పావై ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

తిరుప్పావై ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి ఇరువది ఒకటవ పాశుర అనుసందానము

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ 
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

భావం

పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 

అవతారిక

గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీ కృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను  శ్రీ కృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి  గోపికలతో కూడి శ్రీ కృష్ణుని అర్థించుచున్నది.

Thursday, January 3, 2019

తిరుప్పావై ఇరవదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై  ఇరవదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై  ఇరవదియవ పాశుర అనుసందానము

ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

భావం

ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము కలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము.

బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.

అవతారిక

గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీ కృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి.

ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపుతున్నారు.

స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట  తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,
    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్
    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై
    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్
    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్
    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్



భావం

గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  

    అవతారిక 

స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         

       *(కాపిరాగము - ఆదితాళము)*

ప..     తగదిది నీకిది తరుణిరొ వినవే!
    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!

అ..ప.    తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు
    మగని విశ్లేషమును సహింపజాలవె!
    దీప కాంతులెల్లెడళ విరియగా
    ఆ పంచగుణముల పడకను శయనించి
    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత
    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!
    ఓ పద్మాక్షీ! విభుని లేపవే!

Wednesday, January 2, 2019

తిరుప్పావై పద్దెనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై పద్దెనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై రేపటి పద్దెనిమిదవ రోజు పాశురం

         ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్
    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;
    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి
    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;
    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

భావం

నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.

అవతారిక

శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీ కృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి. ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీళాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపుచున్నారు. పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది. పెరుమాళ్ళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరినీ ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీళాదేవిని ప్రార్ధించి, మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్ధించుచున్నారు. శ్రీ కృష్ణుని దర్శింపజేయుమని వేడుకొంటున్నది మన గోదాదేవి.

        *(సావేరిరాగము - ఏకతాళము)*

ప..     మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
    నందగోవునికి కోడల! నప్పిన్నా! మేలుకో!

అ.ప.    గంధిల కుంతల తరుణీ! కోళ్ళు కూయుచున్నవదే
    మధుర కూజితములు సేయు పిక గణముల గనవటే!
 
చ.    నీ పతి శ్రీకృష్ణుని తిరు నామములను పాడిపాడి
    మా పాటల విభుని మేలుకొలుపగ నిట వచ్చినాము
    ఈ పదముల సంతసించి శ్రీ కంకణములు మ్రోయగ
    నీ పద్మకరాల గడియల నికనైనను తీయరావె!
    మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
    నందగోపునికి, కోడల! నప్పిన్నా! మేలుకో....

Tuesday, January 1, 2019

తిరుప్పావై పదిహేడవ రోజు పాశురము

తిరుప్పావై పదిహేడవ రోజు పాశురము


    అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
    ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
    కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
    ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
    అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
    ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
    శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
    ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

భావం

ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.

 అవతారిక

ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.     

        (ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)

ప..     లేవయ్యా మా స్వామి! నందగోపాలా!
    లేవయ్యా స్వామి! మా సర్వప్రదాతా!

అ..ప..    లేవమ్మ మాయమ్మా! లే యశోదమ్మా!
    లేవె! స్త్రీ జాతి కంతకును తలమానికమ!

చ..    ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ!
    మేలుకో! నిత్య సూరుల స్వామి!
    శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ!
    ఇంక నిదురింపకుమ! లెమ్ము! కృష్ణుని తోడ!
    లేవయ్య మా స్వామి! నందగోపాలా!
    లేవయ్య స్వామి మా సర్వప్రదాతా!

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS