Monday, December 31, 2018

తిరుప్పావై పదహారవ రోజు పాశురము

తిరుప్పావై పదహారవ రోజు పాశురము

తిరుప్పావై పదహారవ రోజు పాశురము

    నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ 
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

 భావం 

మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.

 అవతారిక

ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా! భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.

దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)         

        (ఖరహరప్రియ - ఏకతాళము)

ప..    మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!
    సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

చ..     గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న
    అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.
    చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!
    నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

Sunday, December 30, 2018

తిరుప్పావై పదిహేనవ పాశురము

తిరుప్పావై పదిహేనవ పాశురము

తిరుప్పావై పదిహేనవ పాశురము

ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్. !

భావం

ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ?

లోపల గోపిక     : పూర్ణలగు గోపికలారా ! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను.
 బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము.
లోపల గోపిక     : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే  కఠినురాలను.
బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము.
లోపల గోపిక     :  అందరు గోపికలు వచ్చిరా ?
బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చిలెక్కించుకొనుము.
లోపల గోపిక     : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?
బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీ కృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.

అవతారిక

ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరింపబడినది. ఇట్టి సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలుగుట. అది పూర్ణముగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇట్టి పరిపూర్ణస్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుపబడుచున్నది. మొదటి సగము ఒక తిరుప్పావు -- రెండవ సగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము, భగవత్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునత్తి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎట్టిదో ఈ పాశురములో నిరూపించబడినది.

Saturday, December 29, 2018

తిరుప్పావై పదునాలుగవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి పదునాలుగవ పాశుర అనుసందానము
తిరుప్పావై పదునాలుగవ పాశుర అనుసందానము

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

భావం

స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు. ...... ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలొ ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా  నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా ? మరచితివా ? ఓ లజ్జా విహీనురాలా ! లెమ్ము , ఓ మాట నేర్పుగలదానా ! శంఖమును - చక్రమును ధరించిన వాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము. 

అవతారిక

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒకగోపిక మేల్కొల్పబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలై నడిపింపగల శక్తి గలది, తన పూర్ణానుభవముచే ఒడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయెను. ఈమె ఇంటిలో ఒకపెద్ద తోట కలదు. పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడుబావి కలదు. ఆ దిగుడుబావిలో తామరపూవులు, కలువపూవులు ఉన్నవి. ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతరములను మరచి ఉండెను. అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈరోజు మేలుకొలుపుచున్నారు.

Friday, December 28, 2018

తిరుప్పావై రేపటి పదమూడవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి పదమూడవ పాశుర
 అనుసందానము


పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్ 
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్

భావం

పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని, మనలను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పదితలలను హేలగా చిగుళ్ళు తుంపినట్లు తుంపి పారేసిన శ్రీరాముని గానము చేయుచు పోయి, మనతోడిపిల్లలందరును వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులుగలదానా ! లేడివంటి చూపులుగలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు. గురుడు అస్తమించుచున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగహనమొనర్చి స్నానమొనర్పక పాన్పుపై పడుకొని ఉండెదవేల ? ఓ సుకుమార స్వభావా ! ఈ మంచిరోజున నీవు నీ కపటమును వీడి మాతో కలసి ఆనందమును అనుభవించు. 

అవతారిక

ఈ పాశురమున మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానమును ఆక్రమించినది. కంటియందు అందము ఉండవలనేగాని, ఆ శ్రీకృష్ణుడు వెదుకు కుంటూ రాకుండా ఎలా ఉండగలడు -- అనే ధైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంటిలోనే పడుకొని ఉన్నది. నేత్రము అంటే జ్ఞానము. అజ్ఞానమునకు అందము స్వస్వరూపము - పరస్వరూపము స్పస్టముగా తెలియుట. జీవుడు పరమాత్మకే చెందినవాడు. పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు. పరమాత్మనే పరతంత్రుడు అని తెలుసుకొనుట స్వస్వరూపజ్ఞానము. ఈవిధంగా తెలుసుకొనినవారు పరమాత్మను పొందుటకు తమకు తామై ప్రయత్నమేమీ చేయరు. అతని సొత్తు ఐన నన్ను అతనే స్వీకరిస్తాడు అని నిర్భయంగా ఉందురు. నేటి గోపిక కృష్ణునితో కలియవలెనని కోరిక ఉన్నను కృష్ణుని పొందుటకు తాను ఏ ప్రయత్నమూ చేయక కృష్ణుడు ఒకనాడు పడుకొని వదిలిన శయ్యను వాసన చూస్తూ, దాని స్పర్శనే అనుభవించుచు మోహము పొంది, శయనించి ఉండెను. అట్టి గోపికను ఈనాడు మేలుకొలుపుతున్నారు.

Thursday, December 27, 2018

తిరుప్పావై పదకొండవ పాశుర అనుసందానము

తిరుప్పావై పదకొండవ పాశుర అనుసందానము

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ   చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం  పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు  నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

భావం

లేగదూడలు కలవియు, దూడలవలె ఉన్నవియు అగు ఆవుల మందలను ఎన్నింటినో పాలుపితుక కలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకులు వంశమున మొలచిన ఓ బంగారుతీగా !పుట్టలోని పాముపడగ వలె ఉన్న వితంబ ప్రదేశము కలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశంతో ఒప్పుచున్నదానా ! రమ్ము, చుట్టములను, చెలికత్తెలును మొదలుగ అందరును వచ్చి నీముంగిట చేరిరి. నీలిమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండిరి. ఐనా గాని నీవు ఉలుకక - పలుకక ఉన్నవేమి ? ఓ సంపన్నురాలా ! నీనిద్రకు అర్థమేమో తెలుపుము.

అవతారిక

ఈ పాశురమున లేపబడు గోపిక కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరు అంతటికి ఆదరణీయుడైనట్లు, ఈమె కూడా ఊరులోని అందరి మన్నలను అందిన ఆమె. పతిసంయోగ యోగ్యమగు ఆమె. ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయుట ఏమిటి ? అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరించవలెను అని నిర్భయంగా ఉన్నది ఆమె. సౌందర్యము శరీర నిష్టము, అందుచే ఆమె శరీరమునే చూచి మేల్కొలుపుచున్న గోపికలు మురియుచున్నారు. ఇట్లనుటచే భగవత్భక్తులను ఆశ్రయించునపుడు వారి ఆత్మగుణ పూర్తిచే కల్గు అంతర సౌందర్యమేకాక బాహ్యసౌందర్యం కూడ అనుభవింపబడవలెను. ఆచార్యుల దివ్యమంగళ విగ్రహమును చూచుటచే కూడ ప్రీతి కలుగవలెను. ఆ మూర్తిని వదలలేని మమకారము ఏర్పడును. అట్టి ప్రీతి ఈ గోపికలకు కలిగినది అనుటచే లోపల నిద్రిస్తున్న గోపిక భగవదనుభవమున పరిపూర్ణురాలై తన దివ్యమంగళ విగ్రహదర్శనము చేతనే వీరిని ఆనందింపచేయుజాలినదై ఉన్నదని తెలియుచున్నది.

Wednesday, December 26, 2018

రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము

రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము


రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భావం

లేగదూడలుగల గేదెలు పాలుపితుకువారు లేక లేగదూడలను తలచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టునట్లుతోచి పాలు .... పొడుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి. మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతియైన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి ఈ గాఢనిద్ర !ఊరివారికి అందరికి నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము ---- అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లిలిని మేల్కొలిపినారు

అవతారిక

భగవత్సేవాలక్ష్మి సంపన్నతగల ఒక గోపాలుని చెల్లెలిని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఇతనికి సమృద్ధిగా గేదెలమంద కలదు. కాని పాలుపితకడు, పాలుకారి నెల అంతా బురదమయము అగుచుండును. అట్టివాని చెల్లెలు ఈమె. ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వవృత్తులను నియమించి ఉండును. ఇది కూడా ఒక విధమైన నిద్రవంటిది. ఇంతవరకు నాలుగు పాశురములలొ నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేల్కొలుపుటలో ఈ స్థితప్రజ్ఞావస్థలోని దశాలనే వివరించారు.

Tuesday, December 25, 2018

తిరుప్పావై పదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై పదియవ పాశుర అనుసందానము

తిరుప్పావై పదియవ పాశుర అనుసందానము

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

భావం

మేము రాకముందే నోమునోచి, దానిఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాట ఐననూ పలుకవా ! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియూలేని మావంటి వారము మంగళము పాడినను 'పఱ' అను పురుషార్థమును ఇచ్చెడి పుణ్యమూర్తి, ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఒడింపబడి తనసొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఇచ్చినాడా ! ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓతల్లీ ! మాకందరకు శిరోభూషణమైనదానా ! నిద్రనుండి లేచి, మైకము వదిలించుకొని, తేరుకొని వచ్చి తలుపు తెరువుము. నీనోరు తెరచి మాట్లాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు.

అవతారిక

తనను పొందుట భగవానునికి ఫలము కాని, తనకు కాదు కనుక ఉద్వేగము పొందవలసినది పరమాత్మనే కానీ - తనకెందుకు అని నిశ్చలముగా ఉండెను. ఒకవేళ బ్రహ్మానుభవ సుఖము లభించినను దానియందు మమకారము లేకయుండును. ఆ సుఖము వానిదికదా ! తనకెందుకు సుఖమునందు మమకారము ?  శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది, నిరంతరము క్రిష్ణానుభావమునకు నోచుకొన్నదియై ఉన్నది. అట్టి ఆ గోపికను (ఈ పాశురములో) నిద్దురలేపుచున్నారు.

Monday, December 24, 2018

తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము


తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్  అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

భావం

పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మింపబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెలుగుచుండగా అగరుధూపము ఘుమఘుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపు గడియతీయుము. ఓఅత్తా ! నీవైనను ఆమెను లేపుము. నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా ? లేక ఎవరైనా కదలిన ఒప్పమని కావలియున్నారా ? లేక గాఢనిద్రపట్టునట్లు మంత్రించినారా ? మహామాయావీ ! మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. 

అవతారిక

మొదటి రెండు పాశురములలొ శ్రవణము చెప్పబడింది. తర్వాతి పాశురములో మననము నిరూపింపబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరింపబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకు స్వాతంత్ర్యం ఎందుకు ? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్టపొంది నిద్రిస్తున్న నాల్గవ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది. ఓ మామకూతురా ! మరదలా లేవమ్మా ! అంటున్నారు.

Sunday, December 23, 2018

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

    కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
    మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
    పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
    కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
    పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
    మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
    దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
    ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.

భావం

తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీ కృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీ కృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
    
అవతారిక

క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.      
            (మలయమారుత రాగము - ఆదితాళము)

ప.    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై! తరలె!
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

అ..ప.    పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు 
    తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ    
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

చ..    కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన 
    కేశవుడౌ సర్వేశుని జేరి 
    ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప-లో 
    కేశుడౌ తాను కాపాడడే మనల 
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై తరలె!

Saturday, December 22, 2018

దత్తాత్రేయ చరిత్ర

దత్తాత్రేయ చరిత్ర

దత్తాత్రేయ చరిత్ర

దత్తాత్రేయ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు  మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ  స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి  మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.
ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది-గురు (ఆది గురువు) గా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను.   ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తి కి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు; ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు, అద్వైత  వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు.

జీవితం

నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి  ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" (ఓ మాతా! మాకు భిక్ష ప్రసాదించు) అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి, కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు, తెప్పాల చెక్కలు ఆహారం పెట్టటం సాంప్రదాయం .మ హాభారతం లో, దత్తాత్రేయుడు అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు. మాఘ కవి రచించిన శిశుపాల వధ (శిశుపాలుడిని వధించడం) కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి వంశవృక్షంగా పేర్కొంటోంది.

యాత్రలు

పరమసత్యం కోసం అన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి నగ్నంగా తిరుగసాగాడు. అతడు తన జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మరియు గుజరాత్ లోని నర్మదా నది  ప్రాంతాలలో తిరిగినట్లు కనబడుతోంది. ప్రస్తుతం ఉత్తర కర్నాటకలోని గనకపుర అని వ్యవహరించబడుతున్న పట్టణంలో అతడికి జ్ఞానోదయం కలిగింది. గిరినార్‌లోని ఒంటరి పర్వతాగ్రం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయని జనం విశ్వసిస్తున్నారు. అనుయాయి పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర-రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్త ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది.

గురువులు

తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుని ప్రార్థించాడని, చివరకు బ్రహ్మజ్ఞానం (శాశ్వత జ్ఞానం) పొందాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. అందుకనే, దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు. ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపర్చబడింది. దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు  చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది, దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు: భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. దత్తాత్రేయుడి 24 గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత్ యొక్క 24 గురువులనుంచి వచ్చారు.

దత్తాత్రేయుడి అనుయాయులు:

 కార్తవీర్యార్జున, పరశురాముడు, యదు, అలార్క, ఆయు మరియు ప్రహ్లాదుడు. వీరు పురాణాల ద్వారా వెలుగులోకి వచ్చారు. అవధూతోపనిషత్తు మరియు జాబాలదర్శనోపనిషత్తు లలో వర్ణించబడిన సంస్కృతి అనే మరో పేరు కూడా ఉంది.

అవతార పురుషుడిగా

వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజావిధానంగా కలిసిపోయిన కాలంలో, శ్రీ దత్తాత్రేయుడు చిన్నవయసులోనే ఇల్లు వదిలి వెళ్లాడు. దత్తాత్రేయుడు వంటి పురుషులే దీన్ని సాధ్యం చేశారు. అతడి ముగ్గురు సన్నిహిత అనుయాయులు రాజులు ఒకరు అసురుడు మరియు మిగిలిన ఇద్దరూ క్షత్రియ కులానికి సంబంధించిన వారు. దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర (శివ) అవతారంగా భావించుకునేవాడు, తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువు గా ప్రకటించారు. అయితే ఇది బయటకు కనిపిస్తున్నంత ఒంటెత్తువాదపు ప్రకటన కాదు; శివ, విష్ణువులు ఇద్దరూ ఒకటేనని లేదా పరమసత్య రూపపు వ్యక్తీకరణలని హిందువులు గుర్తిస్తుంటారు. నిజానికి, విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకంచేసే ఓం నమశ్శివాయ మంత్రంతో ముగుస్తుంది. మూడో అధ్యాయపు చివరి భాగం, మహాశ్వరుడు (శివ) ఒక్కడే వాస్తవికతను వ్యాపింపజేస్తాడని, ప్రతి మనిషి హృదయంలో వెలుగుతాడని చెప్పబడింది. అతడొక్కడే కేంద్రానికి ముందు, వెనుక, ఎడమవైపున, కుడివైపున, కింద, పైన, ప్రతిచోటా నెలవై ఉన్నాడు. చివరగా, దత్తాత్రేయుని శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుడిని దత్తాత్రేయునితో సంలీనం చేశారు.

Friday, December 21, 2018

తిరుప్పావై రేపటి ఏడవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి ఏడవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి ఏడవ పాశుర అనుసందానము

కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు 
పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి 
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
భావం

భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజ్రుంభించి, ఆకాశామంటుచున్నవి. ఆధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును. 
అవతారిక

భగవదనుభవము నిత్యనూతనమై మొహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.

Thursday, December 20, 2018

తిరుప్పావై రేపటి ఆరవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి ఆరవ పాశుర అనుసందానము

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్భా

భావం:-
భగదనుభవము క్రొత్తదగుటచే ఈవ్రతముయొక్క వైభవము తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికిరాకయున్న ఒకముగ్ధను లేపుచున్నారు. ఆహారము నార్జించుకొనుటకై లేచి పక్షులు కలకలలాడుచు పోవుచున్నది. ఆపక్షులకు నాయకుడైన గరుక్మంతునకు స్వామియగు శ్రీమహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది సేవలకురండని పెద్దధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా !ఓ పిల్లా !లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలుగవచ్చును. పూతన స్తనములందుడు విషమునారగించినవాడును, అసురావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు, పాలకై ఏడ్చి కాలుచాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషసయ్యపై లోకరక్షణచింతతో యోగనిద్ర అమరియున్న జగత్కారణభూతుడునగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను, యోగులను హరి - హరి హరియనుచుండునపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్లబరచి, మమ్ములను మేల్కొల్పినది - నీవు కూడా లేచిరమ్ము. 

అవతారిక
ఈవ్రతమున ప్రధానముగా పొందవలసిన ఫలము భాగవత్సమాగమము. భగవత్సమాగమము అనెడి ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేస్వరుడే ! ఈవ్రతము ఆచరించుటకు భగవత్సమాగమము పొందవలెనన్న కోరిక కలవారు అందరు అర్హులే. అని మొదటిరోజున అందరకు తెలియచేసిరి. సర్వేశ్వరుడే ఉపాయము , ఫలము అని నమ్మి భగవత్ప్రాప్తినే కాంక్షించు వారైనను ఇంద్రియములు వ్యాపారరహితముగా ఉండవు కనుక కాలక్షేపమునకు పరిపూర్ణమగు అనురాగముతో ఈవ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించుట జరిగింది. ఈవ్రతమునకు పదిరోజుల ముందుగ ... పదిమంది గోపికలను మేల్కొలిపి, వారితో కలిసి వ్రతమునకు సాగుదురు.

Tuesday, December 18, 2018

గోదా దేవి అష్టోత్తర శతనామావళి

గోదా దేవి అష్టోత్తర శతనామావళి
ధనుర్మాస సరస్వం-ధనుర్మాస పూజా విధానము
ధనుర్మాస వ్రతం
విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .
ధనుర్మాసం అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి ? "మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడ్డది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాల తక్కువ. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏమైనా సాధించాలి అంటే ఇపుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేళు జీవుడిని సూచిస్తే, ప్రక్కన ఉన్న మూడు వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు మరియూ సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేళు సాత్వికాన్ని తెలిపేది, చిన్నది. బ్రొటనవేళు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేళును బ్రొటనవేళు వైపు వంచడమే జ్ఞాన ముద్ర. దాని ఆచరణనే ధనుర్మాస వ్రతం,అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం సాత్విక ప్రవృత్తి పెంచుకోవడానికి సరియైన సమయం, అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవాలి" - శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు

01 వ రోజు 16 డిసెంబర్
02 వ రోజు 17 డిసెంబర్
03 వ రోజు 18 డిసెంబర్
04 వ రోజు 19 డిసెంబర్
05 వ రోజు 20 డిసెంబర్
06 వ రోజు 21 డిసెంబర్
07 వ రోజు 22 డిసెంబర్
08 వ రోజు 23 డిసెంబర్
09 వ రోజు 24 డిసెంబర్
10 వ రోజు 25 డిసెంబర్
11 వ రోజు 26 డిసెంబర్
12 వ రోజు 27 డిసెంబర్
13 వ రోజు 28 డిసెంబర్
14 వ రోజు 29 డిసెంబర్
15 వ రోజు 30 డిసెంబర్
16 వ రోజు 31 డిసెంబర్
17 వ రోజు 01 జనవరి
18 వ రోజు 02 జనవరి
19 వ రోజు 03 జనవరి
20 వ రోజు 04 జనవరి
21 వ రోజు 05 జనవరి
22 వ రోజు06 జనవరి
23 వ రోజు 07 జనవరి
24 వ రోజు 08 జనవరి
25 వ రోజు 09 జనవరి
26 వ రోజు 10 జనవరి
27 వ రోజు 11 జనవరి
28 వ రోజు12 జనవరి
29 వ రోజు 13 జనవరి
30 వ రోజు 14 జనవరి
ధనుర్మాస వ్రత సంకల్పం
పెద్దలు ఆండాళ్ తల్లి గురించి చెప్పుతూ తమిలంలో ఈ పాటను పాడిరి.
అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్
పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై
శూడి కొడుత్తాళై చ్చోల్లు
శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై
పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ
వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం
నాంగడవా వణ్ణమే నల్గు

"అన్నవయల్ పుదువై ఆండాళ్" గోదాదేవిని శ్రీ విల్లిపుత్తూర్ స్థలంతో కలిపి గుర్తించాలని, ఎందుకంటే జల సమృద్దిగా ఉండే ఆ క్షేత్రాన్ని ఆనుకొని పచ్చని పంటపోలాలు ఉండేవి. ఆ నీటికై హంసలు, కొంగలు అక్కడికి చేరేవి, చూడటానికి రెండూ తెల్లగా ఉన్నా వేరే వేరేలక్షణాలు కల్గి ఉంటాయి. ఏది సారమో ఏది అసారమో తెలుసుకొని సారాన్నే గ్రహించి బ్రతికేది హంస. తనకు లభించేంతవరకు దక్షతతో దీక్షగా ఉండి లభించగానే ఉపవాసం మానేది కొంగ. కాబట్టి మనం హంసనే ఆశ్రయించాలి. గోదాదేవి గొప్ప హంస, అందమైన నడక కల్గినది. ఈ లోకంలో ఏది సారతగుమో దాన్ని మాత్రమే గ్రహించి, అనుభవించి, చక్కని నడక కల్గిన మహనీయులను పరమ హంసలు అని అంటారు. అలాంటి పరమ హంసలు వచ్చేవారు శ్రీవెల్లిపుత్తూరికి గోదావద్ద నడక నెర్చుకోవటానికి. తిరుప్పావై లో ఏది వేదములు, ఉపనిషత్తులు తగునని చెప్పెనో అవన్ని చూపించినది మన తల్లి గోదా. రామానుజాచార్యులవంటి వారుకూడా ఆదర్షంగా తీసుకోవటంచే యతిరాజసహోదరి అయ్యింది గోదా. జ్ఞానులైన మహానుభావులకే నేర్పే యోగ్యురాలు మన అమ్మ గోదా. ఏమి చెసింది ఆమే, "అరంగఱ్ఱ్కు ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం" శ్రీరంగనాథున్ని ప్రేమించి 30 క్రమమైన పాటల్ని తిరుప్పావైగా పాడింది. మేడపైకి ఎక్కడానికి ఒకటి తర్వాత ఒకటి అమరి ఉండే మెట్లమాదిరిగా, మానవుడు ఈలోకంలో జ్ఞానం ఉంది అనుకున్నప్పటి నుండి, జ్ఞానసారమైన పరతత్వాన్ని చేరేంతవరకు అచరించతగిన లౌకిక అలౌకిక యిహలౌకిక పారలౌకిక పారమార్తమైన అన్ని రకాల అనుభవాలకి అనువైనట్టుగా 30 పాటలను మెట్లుగా తాను పాడి వినిపించినది."ఇన్నిశైయాల్ పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై శూడి కొడుత్తాళై చ్చోల్లు" పాటలమాలలను పాడింది, పూలమాలను ధరించి స్వామికి అర్పించినది. ఈ రెండూ ఎంగిలివేగా!! దొషం కాదా!! అంటే ఎలాగైతే తేనెటీగలు ఎంగిలి చేసినా తేనె వినియోగతగమవునో, చిలక ఎంగిలి చేసిన పండు తిన తగునో, అలాగే భగవంతునికోసమై చేస్తే ఎదీ ఎంగిలికాదు."శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై పాడియరుళవల్ల పల్-వళై యాయ్" శుడర్ క్కొడి అనగా బంగారు లత. ఎలాగైతే బంగారం మనం కల్గి ఉంటే మన విలువ పెరుగుతుందో, గోదా తల్లి మన దగ్గర ఉంటే మన విలువ పెరుగుతుంది. ఎలాగైతే లత పట్టుకొమ్మని ప్రాకి పుష్పాలను విరజిమ్మునో, ఈ గోదా రంగనాథున్ని ఆధారంగా చేసుకొని ప్రాకి జ్ఞానం అనే పుష్పాలతో మనల్ని తరించింది. మనం కూడా ఆ తల్లి పాడిన పాటలను పాడుదాం. ఏమి చెసింది ఆ వ్రతంలో గోదా, "నాడినీ వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం నాంగడవా వణ్ణమే నల్గు" ఒకటి రెండు .. పదులు .. వందలు గా పాయసాన్ని అర్పిస్తానని చేస్తూ తనను తానే భగవంతునికి అర్పించింది. జీవుడు భగవంతున్ని చేరాలనే కోరిక సహజమే కదా. మాకుకూడా ఆ కొరిక కల్గేట్టు, మమ్మల్ని తీర్చిదిద్దు. భగవంతున్ని సేవించటానికి శక్తిని భక్తిని మనకు కూడా గోదా అందించుగాక.
శ్రీ గోదా పూజా విధానము
నిత్య ఆరాధనలో లక్ష్మీ అష్టోత్తరం తరువాత శ్రీకృష్ణఅష్టోత్తర శతనామావళి, శ్రీగోదా అష్టోత్తర శతనామావళి చేర్చి పూజ చేయండి.
శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి

01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
78 ఓం కంబుకంఠ్యై నమః
79 ఓం సుచుబుకాయై నమః
80 ఓం బింబోష్ఠ్యై నమః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్శ్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం శ్రీఅనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః

ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

ధనుర్మాస పూజా విధానము
గోదాయై నమః శ్రీమతే రామానుజాయ నమః
స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకొని గురుపరంపరను అనుసంధించుకొని, పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి.

అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూః
కృతఘ్నో దుర్మానీ స్మర పరవశో వంచన పరః |
నృశంసః పాపిష్ఠః కథ మహమితో దుఃఖజలధేః
అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః ||

నమో నమో వాఙ్మనసాతి భూమయే
నమో నమో వాఙ్మనసైక భూమయే |
నమో నమోనంత మహావిభూతయే
నమో నమోనంత దయైక సింధవే ||

న ధర్మ నిష్ఠోస్మి నచాత్మవేదీ
న భక్తి మాన్ త్వహ్చరణారవిందే |
అంకిచనో నన్యగతిశ్శరణ్యః
త్వ త్పాద మూలం శరణం ప్రపద్యే ||

కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురు ||

తతోఖిల జగత్పద్మ భోధాయాచ్యుత భానునా |
దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

ఇతి కర తాళత్రయేన భగవంతం ప్రభోధ్య, కవాటం విముచ్య
(3 సార్లు చప్పట్లు చరిచి, ద్వారములు తీసి పెరుమాళ్ళను మేల్కొలపాలి)

నిర్మాల్యము తొలగించి, మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణముగా భావించి, పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, తులసీదలము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను.

ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకొని
స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం ( అని పెరుమాళ్ళతో విన్నవించి)

స్వ శేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః |
విధాతుం ప్రీత మాత్మానం దేవః ప్రక్రమతే స్వయం ||

భగవన్! పుండరీకాక్ష! హృద్యాగంతు మయాకృతం |
ఆత్మ సాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్భయే ||

(అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)

_1. ధ్యానము_

కూర్మాదీన్ దివ్యలోకాన్, తదను మణిమయం
మంటపం తత్రశేషం |

తస్మిన్ ధర్మాది పీఠం, తదుపరి కమలం
చామర గ్రాహిణీశ్చ |

విష్ణుం దేవీర్విభూషాయుధగణ, మురగం
పాదుకే వైన తేయం

సేనేశం ద్వార పాలాన్ కుముదముఖ గణాన్
విష్ణు భక్తాన్ ప్రపద్యే

సవ్యం పాదం ప్రసార్య, ఆశ్రిత దురిత హరం
దక్షిణం కుంచయిత్వా

జానున్యాధాయ సవ్యేతర మితరభుజం
నాగ భోగే నిధాయ |

పశ్చాద్భాహుద్వయేన ప్రతిభట శమనే
ధారయన్ శంఖ చక్రే |

దేవీ భూషాది జుష్టో జనయతు
జగతాం శర్మ వైకుంఠ నాథః

(శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా యుంచి మనస్సులో కూడా వారిని నిలుపుకొంటూ)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
శ్రీ-భూ-నీళా-గోదాది దేవిభ్యో నమః
అనంత గరుడ విష్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః
శ్రీ పరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః
ఓం సర్వాన్ ధ్యాయామి

2. స్వాగతం (నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి)
ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)

3.సింహాసనం ( మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి) రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_4. అర్ఘ్యం_
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(అర్ఘ్య పాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_5. పాద్యం_
పాదయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)
(పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_*6. ఆచమనీయం*_
ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)
(ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
దంత కాష్ఠ జిహ్వా నిర్లేఖన గండూషణ
ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన
అంగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన
స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి

_*7. పవిత్ర స్నానం*_
స్నానం సమర్పయామి
(స్నాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)

_*8. వస్త్ర యుగ్మం*_
వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన పట్టు వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)

_*9. ఊర్ధ్వ పుణ్డ్రం*_
ఊర్ధ్వ పుణ్డ్రాన్ సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)

_*10. యజ్ఞోపవీతం*_
యజ్ఞోపవీతం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_*11. చందనం*_
దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)

_*12. ఆభరణములతో అలంకారం*_
సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
(ఈ విధముగనే పరివారమునకందరకూ అలంకరణ పర్యంతము చేసి)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

*_13. నామావళి_*
ఓం శ్రీరంగనాయక్యై నమః
తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి
(తులసీ దళములు, పుష్పములతో కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దానియంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి)

01 ఓం కేశవాయ నమః
02 ఓం నారాయణాయ నమః
03 ఓం మాధవాయ నమః
04 ఓం గోవిందాయ నమః
05 ఓం విష్ణవే నమః
06 ఓం మధుసూదనాయ నమః
07 ఓం త్రివిక్రమాయ నమః
08 ఓం వామనాయ నమః
09 ఓం శ్రీధరాయ నమః
10 ఓం హృషీకేశాయ నమః
11 ఓం పద్మనాభాయ నమః
12 ఓం దామోదరాయ నమః
13 ఓం సంకర్షణాయ నమః
14 ఓం వాసుదేవాయ నమః
15 ఓం ప్రద్యుమ్నాయ నమః
16 ఓం అనిరుద్ధాయ నమః
17 ఓం పురుషోత్తమాయ నమః
18 ఓం అధోక్షజాయ నమః
19 ఓం నారసింహాయ నమః
20 ఓం అచ్యుతాయ నమః
21 ఓం జనార్దనాయ నమః
22 ఓం ఉపేంద్రాయ నమః
23 ఓం హరయే నమః
24 ఓం శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీకృష్ణాయ నమః
02 ఓం కమలానాథాయ నమః
03 ఓం వాసుదేవాయ నమః
04 ఓం సనాతనాయ నమః
05 ఓం వసుదేవాత్మజాయ నమః
06 ఓం పుణ్యాయ నమః
07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః
08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
09 ఓం యశోదావత్సలాయ నమః
10 ఓం హరయే నమః
11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః
12 ఓం దేవకీనందనాయ నమః
13 ఓం శ్రీశాయ నమః
14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15 ఓం యమునావేగ సంహారిణే నమః
16 ఓం బలభద్రప్రియానుజాయ నమః
17 ఓం పూతనాజీవిత హరాయ నమః
18 ఓం శకటాసురభంజనాయ నమః
19 ఓం నందవ్రజ జనానందినే నమః
10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః
22 ఓం నవనీతనటాయ నమః
23 ఓం అనఘాయ నమః
24 ఓం నవనీతనవాహారాయ నమః
25 ఓం ముచికుందప్రసాదకాయ నమః
26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27 ఓం త్రిభంగినే నమః
28 ఓం మధురాకృతయే నమః
29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః
30 ఓం గోవిందాయ నమః
31 ఓం యోగినాంపతయే నమః
32 ఓం వత్సవాటచరాయ నమః
33 ఓం అనంతాయ నమః
34 ఓం ధేనుకాసురభంజనాయ నమః
35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36 ఓం యమళార్జునభంజనాయ నమః
37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః
38 ఓం తమాలశ్యామలాకృతయే నమః
39 ఓం గోపగోపీశ్వరాయ నమః
40 ఓం యోగినే నమః
41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః
42 ఓం ఇలాపతయే నమః
43 ఓం పరంజ్యోతిషే నమః
44 ఓం యాదవేంద్రాయ నమః
45 ఓం యదూద్వహాయ నమః
46 ఓం వనమాలినే నమః
47 ఓం పీతవాససే నమః
48 ఓం పారిజాతాపహారకాయ నమః
49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః
50 ఓం గోపాలాయ నమః
51 ఓం సర్వపాలకాయ నమః
52 ఓం అజాయ నమః
53 ఓం నిరంజనాయ నమః
54 ఓం కామజనకాయ నమః
55 ఓం కంజలోచనాయ నమః
56 ఓం మధుఘ్నే నమః
57 ఓం మధురానాధాయ నమః
58 ఓం ద్వారకానాయకాయ నమః
59 ఓం బలినే నమః
60 ఓం బృదావనాంత సంచారిణే నమః
61 ఓం తులసీదామభూషణాయ నమః
62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః
63 ఓం నరనారాయణాత్మకాయ నమః
64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః
65 ఓం మాయినే నమః
66 ఓం పురమపురుషాయ నమః
67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః
68 ఓం సంసారవైరిణే నమః
69 ఓం కంసారయే నమః
70 ఓం మురారయే నమః
71 ఓం నరకాంతకాయ నమః
72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః
75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః
76 ఓం విదురాక్రూరవరదాయ నమః
77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
78 ఓం సత్యవాచే నమః
79 ఓం సత్యసంకల్పాయ నమః
80 ఓం సత్యభామారతాయ నమః
81 ఓం జయినే నమః
82 ఓం సుభద్రాపూర్వజాయ నమః
83 ఓం విష్ణవే నమః
84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
85 ఓం జగద్గురవే నమః
86 ఓం జగన్నాథాయ నమః
87 ఓం వేణూనాదవిశారదాయ నమః
88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః
89 ఓం బాణాసుర కరాంతకాయ నమః
90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః
92 ఓం పార్థసారథయే నమః
93 ఓం అవ్యక్తాయ నమః
94 ఓం గీతామృతమహోదధయే నమః
95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
96 ఓం దామోదరాయ నమః
97 ఓం యజ్ఞభోక్త్రే నమః
98 ఓం దానవేంద్రవినాశకాయ నమః
99 ఓం నారాయణాయ నమః
100 ఓం పరస్మై బ్రహ్మణే నమః
101 ఓం పన్నగాశనవాహనాయ నమః
102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
103 ఓం పుణ్యశ్లోకాయ నమః
104 ఓం తీర్థపాదాయ నమః
105 ఓం వేదవేద్యాయ నమః
106 ఓం దయానిధయే నమః
107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
108 ఓం సర్వ గ్రహరూపిణే నమః
109 ఓం పరాత్పరాయ నమః

శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై మనః
78 ఓం కంబుకంఠ్యై మనః
79 ఓం సుచుబుకాయై మనః
80 ఓం బింబోష్ఠ్యై మనః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

01 ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః
02 ఓం శ్రీ భూదేవ్యై నమః
03 ఓం శ్రీ నీళాదేవ్యై నమః
04 ఓం శ్రీ గోదాదేవ్యై నమః
05 ఓం శ్రీ అనంతాయ నమః
06 ఓం శ్రీ గరుడాయ నమః
07 ఓం శ్రీ విష్వక్సేనాయ నమః
08 ఓం శ్రీ పరాంకుశాయ నమః
09 ఓం శ్రీమతే రామానుజాయ నమః
10 ఓం శ్రీమద్వరవరమునయే నమః
11 ఓం స్వాచార్యేభ్యో నమః
12 ఓం పూర్వాచార్యేభ్యో నమః
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
*14. ధూప పరిమళం*
ధూపమాఘ్రాపయామి
*15. దీపం*
దీపం సందర్శయామి
ధూప దీప అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించండి)

*16 నైవేద్యం*
నైవేద్యం సమర్పయామి
(పొంగలిని ప్రోక్షించి మృగముద్రతో ఆరగింపు చేయండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
గండూషణం సమర్పయామి

*17 మంగళాశాసనం*
మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)
లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |
క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||

స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||

*18. సేవాకాలం*
గురుపరంపర, తిరుప్పళ్లియొళుచ్చి, తిరుప్పావై 28 వ పాశురం వరకు చదవండి

*19 నైవేద్యం*
అర్ఘ్యం సమర్పయామి
పాద్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం సమర్పయామి
(స్థలమును శుద్ధి చేసి ప్రసాదము, ఫలాదులను అన్నింటినీ యుంచి, ప్రోక్షించి, తులసి యుంచి, సురభి ముద్రను చూపి, మృగముద్రతో ఆరగింపు చేయాలి.)

పాయసాన్నం గూడాన్నంచ ముగ్దాన్నం శుద్ధమోదనం
దధి క్షీరాజ్య సంయుక్తం నానాశాక ఫలాన్వితం ||

అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాదితాన్
పృథుకాన్ గూడసమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్ ||

అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృత శర్కరం
పంచధా షడ్రసోపేతం గృహాణ మధుసూదన ||

'ఓం ఓం ఓం'
(అనుచు స్వామికి చూపండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
గండూషణం సమర్పయామి
తాంబూలం సమర్పయామి (తమలపాకు వక్కలు అందించండి) సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

*20 మంగళాశాసనం*
మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)
తిరుప్పావై 24 వ పాశురమం చదవండి

శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిథయేర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |
క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||

అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనా వాసితోరసే |
శ్రీహస్తిగిరి నాథాయ దేవరాజాయ మంగళమ్ ||

కమలా కుచ కస్తూరీ కర్ద మాంకిత వక్షసే |
యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ ||

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మెనే |
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ ||

స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||

శ్రీ నగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే|
శ్రీ తింత్రిణీ మూలధామ్నే శఠకోపాయ మంగళమ్ ||

శేషో వా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః|
వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళమ్ ||

తులా మూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే
సౌమ్యజామాతృ మునయే శేషాంశాయాస్తుమంగళమ్ ||

మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యైః సత్కృతాయాస్తుమంగళమ్ ||

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

21 చామరోపచారం
చామరోపచారం సమర్పయామి
చామరమును వీచుచు తిరుప్పావై 29, 30 వ పాశురములను ఒక్కొక్కటి రెండు సార్లు అనుసంధించాలి.
ఇచ్చట ఆనాటి పాశురమును హారతినిస్తూ రెండుసార్లు విన్నపం చేయాలి
కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు
స్వామి వారి మంగళా శాసనాలు
*కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం*
హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతులందరూ ధనుర్మాసం రాగానే ఆనందిస్తారు. ఉదయానే్న లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తీర్చి వాటిని కుంకుమ, పూలతో అర్చిస్తారు. తోటి వారినందరినీ కలుపుకుని అఖిలాండకోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడానికి సిద్ధమవుతారు. అలనాడు విష్ణుచిత్తుని కూతురైన గోదాదేవి రంగస్వామిని ఎలా స్మరిస్తుండేదో, అనుక్షణమూ ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో అలానే ఇపుడు కృష్ణ్భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసంకోసం ఎదురుచూస్తారు. ఉదయానే్న లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడిచూసిన ఈ సమయంలో గోదాదేవిని, కృష్ణపరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలకు కలిగిస్తుంటారు.
ఈ ధనుర్మాసంలో తిరుప్పావై- ‘తిరు’’ అంటే శ్రేష్టమైన అనీ- ‘పావై’ అంటే వ్రతమని అర్థం. ప్రాచీన ‘పావై’ అనే తమిళ కవితా పద్ధతికి చెందిన ‘తిరప్పావై’ని రచించినవారు- ‘‘గోదాదేవి’’. ఈమెనే ‘ఆండాళ్’ అని పిలుస్తుంటారు. ‘‘శ్రీవిల్లిపుత్తూరు’’అనే గ్రామంలో విష్ణ్భుక్తుడైన- ‘విష్ణుచిత్తుడు’ ప్రతిరోజూ తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవాడు. ఆ విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాబ్దిలో మునిగి తేలుతుండేవారట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంలో ‘‘పెరియాళ్వార్’’ అనే పేరు స్థిరపరిచారట.
స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కనులు తెరవని చిన్నారి కనిపించిందట. ఆ పాపకు ‘కోదై’ అనే పేరు పెట్టుకొన్నాడు. ఆమె గోదాదేవి. ఈ గోదా చిన్నప్పటినుంచి తండ్రి మాదిరి విష్ణు భక్తురాలైంది. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయ రంగనికి పంపించేదట. ఓ రోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో.. ఎంత తప్పు జరిగిపోయందని వాపోయాడు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగని అర్చనకోసం తీసుకెళ్లాడు. కాని ఆ మాలలు రంగడు స్వీకరించలేదు.
దానితో మరింత కుంగిపోయాడు విష్ణుచిత్తుడు. కాని ఆ రోజు రాత్రి చిత్తాన్ని రంగనికర్పించి నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కనిపించి ‘‘ఓయా నీ గోదా చేసే పని నాకిష్టమైందే, ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతిపాత్రాలు అని చెప్పాడు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయవయ్యా’’ అరి అడిగాడట. రంగని మనసెరిగిన విష్ణుచిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయంచాడు. రంగడిని తన నాధుడిని చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. ధనుర్మాస వ్రత మహత్యం బ్రహ్మాండ, ఆదిత్య, భాగవత పురాణాలతో పాటు- నారాయణ సంహితలోనూ ఉంది.
ధనుర్మాస వ్రతంకోసం విష్ణువు విగ్రహాన్ని ధనుర్మాస ప్రారంభదినంనాడు పూజామందిరంలో మధుసూదనుడు అనే పేరుతో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదు ఘడియలముందే, సంధ్యావందనాది అనుష్టానాలను ముగించుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. మధుసూదనుడికి ప్రతిరోజూ ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మొదటి పదిహేను రోజులూ ‘చక్కెర పొంగలి’ లేదా ‘పులగం’ను, తర్వాతి పదిహేను రోజులూ ‘దద్ద్యోజనం’ను సమర్పించాలనేది శాస్తవ్రచనం. ఈ విధంగా చేయడంతోపాటూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాశీ, రామేశ్వరం, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో వందలకొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒక్క రోజు బ్రాహ్మణుడికి అన్నదానం వల్ల కలుగుతుందని పెద్దలంటారు. ఈ విధంగా మధుసూదనుడితోపాటు ప్రతిరోజూ బృందావనంలో తులసిని పూజించాలి. ఇలా ధనుర్మాసంలో వ్రతాన్ని చేయడం పూర్తయ్యాక మధుసూదనస్వామి విగ్రహాన్ని విప్రుతోత్తమునికి దానం ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం నెల రోజులపాటు చేయలేనివారు కనీసం ఒక్కరోజు అయినా ఆచరిస్తే మంచిది. వేయి సంవత్సరాలపాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసిన వ్రతంవల్ల లభిస్తుంది.
ధనుర్మాసం అనగానే నాకు గుర్తుకు వచ్చేది పొంగలి. నా చిన్నప్పటినించి జ్ఞాపకం. మా అమ్మమ్మ ఈ మాసం అంతా తెల్లవారు ఝామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేసుకొని ప్రతీ రోజు తిరుప్పావై, పాశురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాశురాలు వింటూ నిద్ర లేచే వాణ్ని. అవి నేర్చుకుందామని ప్రయత్నించా కాని మనకు అవి నోరు తిరగలేదు. ఆ తర్వాత వీలు కాలేదు.
శ్రీ రంగనాథుని మనోరదుడిగా భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమ తో ఆరాధనతో ఆ స్వామి ని తన స్వామి ని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభం లో భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసం లో శ్రీ రంగని కోసం ఆచరించిన వ్రతమే " ధనుర్మాస వ్రతం". ఈ వ్రతం భక్తీ , ఆరాధన మార్గాలే కాదు ప్రేమ మార్గాన్ని చూపుతుందట. ఈ పదహారవ తేది నుండి ధనుర్మాసం ప్రారంభం కానుంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి ముప్పయి రోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా రచించి గానం చేసిన " తిరుప్పావై" పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.
చిన్నప్పుడు తెలీదు కాని ఈ కథంతా తెలుసుకొన్న తర్వాత మా అమ్మమ్మ ను నేను ఆట పట్టిచ్చేవాని. గోదా దేవి ప్రేమకోరకు, ప్రియుడి తలుస్తూ రోజు పాటలు , విరహగీతాలు పాడుకుంటే , మీరెందుకే పెళ్ళయిన వాళ్ళు ఇవి చదవడం అని సరదాగా ఆట పట్టిచ్చేవాన్ని. రోజు ఉదయమే స్నానం చేయగానే రెడీ గా ఉండే "పొంగలి" . మళ్ళీ కొంత శర్కర , నేయి కలిపి ముద్దగా చేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.అల తినడం ఓ ఇష్టం.ఇప్పుడంటే కోల్లెస్త్రాల్ భయం కాబట్టి కాస్త తగ్గించి కట్టే పొంగలి తినటం లెండి. పెద్దవయసయినా కూడా మా అమ్మమ్మ ఇప్పటికీ రోజూ శ్రద్దగా తెల్లవారు ఝమునె లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని పాశురాలు చదువుతుంటుంది. ఆ పాశురాలు వినడం , ఆ పొంగలి తినడం ,అందుకే నాకు ఈ ధనుర్మాసం అంటే ఇష్టం.

ధనుర్మాస వ్రతవిధానం
సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ధనుర్మాస వ్రతం
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు
15 రోజులుగానీ,
8 రోజులుగానీ,
6 రోజులుగానీ,
4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.
వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -
"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -
"ఇందిరా ప్రతి గృహ్ణాతు"
అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతం. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.
వ్రత విధానం
ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం.
పాశురాల సాయం

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని 'కూడారై' ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.
ధనుర్మాస వ్రత విశిష్ట - శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్ధ నుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను, ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం. ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా 'మాసోహం మార్గశీర్షోహం' అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది. మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను, దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది. ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.(1) శ్రీ సీతాకళ్యాణం "అష్ఠాక్షరీ మంత్రాన్ని "ఓం నమోనారాయణాయ.(2) శ్రీ గోదాకళ్యాణం" ద్వయమంత్రాన్ని "శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః 3) శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని

శ్లో|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచుః" అని
ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి -

శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.
వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా ఆచార్య నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయటం అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్నవలంభించటం ముద్గాన్నం వండి ఆరగింపు చేయగలగటం ఇవే నియమాలు.
ఆచరిద్దాం! శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం.
తిరుప్పావు
తనియులు
శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||

లక్ష్మీనాథ సమారమ్భం నాథ యామున మధ్యమామ్|
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే!|
అస్మద్గురో ర్భగవతో2స్య దయైకసిన్దోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే..||

మాతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీ మపత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ద్నా.. ||

ఆళ్వారులతనియన్ - శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది ||

భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||

తిరుప్పళ్ళియెళుచ్చి
తమేవ మత్వా పరవాసు దేవం
రంగేశయం రాజవదర్హణీయం
ప్రాబోధికీం యోకృతసూక్తి మాలాం
భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే

మండం గుడి మెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్
తొండరడిప్పడి తొన్నగరమ్ వణ్ణు
తిణర్త వయల్ తెన్న రంగత్తమ్మానై - పళ్ళి
యుణర్తుమ్ పిరానుదిత్త పూర్,

తొండరడిప్పొడి యాళ్ వారు అనుగ్రహించిన రెండు దివ్య ప్రబంధములలో ఇది రెండవ ప్రబంధము "తిరు" అను శబ్దము గోప్పతనమను అర్ధము చెప్పుచు "పళ్ళి" పడక "ఎళుచ్చి" లేచుట అనగా పడకను విడచి లేచుట యని అర్ధము. దీనిలో ఒక్కొక్క పాశురమునందును పళ్ళియెళందరుళాయే అని పడకను విడచి లెమ్మనియే ప్రార్థించుటచే శ్రీ రంగనాధులను మేలుకొలుపుటనే -రాజవదర్హణీయమ్ అని చెప్పిరి దేవాలయాల్లో నేడు విన్పించే సుప్రభాతములకు ఇదియే నంది అని పెద్దల వాక్కు.

1. కదిరవన్ కుణతిశైచ్చిగరమ్ వన్ధణైన్దాన్
కనైయిరుళగన్ఱచు కాలైయమ్ పొళుదాయ్
మదువిరిన్దోళుగిన మామలరెల్లామ్
వానవరరశర్ కళ్ వన్దు వన్దీణ్డి,
ఎదిర్ దిశై, నిఱైన్ధన రివరొడుమ్ పుగున్ధ
ఇరుంగళి త్తీట్టముమ్ పిడియెడు మురశుమ్
అదిర్ దలిలలై కడల్ పోన్ఱుళదు ఎంగుమ్
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె

2. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి
క్కూర్ న్ధదు కుణదిశై మారుద మిదువో,
ఎళున్ధన మలరణై ప్పళ్ళి కొణ్డన్నమ్
ఈన్బనిననైన్ధ తమిరుమ్ శిఱుగుదఱి
విళుంగియ ముదలైయిన్ పిలమ్బురై పేళ్వాయ్
వెళ్ళెయిఱుఱవదన్విడత్తినుక్కనుంగి,
అళుంగియ వానైయి నరుమ్ తుయర్ కెడుత్త
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె..

3. శుడరొళి పరన్ధన శూళిందిశై యెల్లామ్
తున్నియ తారకై మిన్నొళిశురజ్గి.
పడరొళి పశుత్తనన్ పనిమది యివనో
పాయిరుళగనదు పెమ్ పోళిఱ్కముగిన్
మడిలిడైక్కీఱి వణ్ పాళై కళ్ నాఱ
వైగఱై కూర్ న్ధదు మారుద మిదువో
అడలొళి తిగళదరు తిగిరియమ్ తడక్కై
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే...

4. మేట్టిళమేదిగళ్ తళై విడు మాయర్ గళ్
వేయజ్ఞుళలో శైయుమ్ విడైమణిక్కురలుమ్
ఈట్టియ విశైదిశై పరన్ధన వయలుళ్
ఇరిన్ధన శురుమ్బిన మిలజ్గైయర్ కులత్తై,
వాట్టియ వరిశిలై వానవరేఱే
మాముని వేళ్వియైక్కాత్తు అవపిరదమ్
అట్టియవడుతిఱలయోత్తి యెమ్మరశే
అరంగత్తమ్మా పళియెళున్ధరుళాయే..

5. పులంమ్బిన పుట్కళుమ్ - పూమ్ పోళుల్ గళిన్ వాయ్
పోయిత్తుంగళ్ పుగున్ధదు పులరి
కలన్ధదు కుణదిశైక్కనై కడలరవమ్
కళివణ్ణు మిళుత్తియ కలమ్బగమ్ పునైన్ధ
అలంగలన్దొడైయల్ కొణ్ణడియిణై పణివాన్
అమరర్ కళ్ పుగున్ధన రాదలిలమ్మా
ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్
ఎమ్బెరుమాన్ పళ్ళియేళున్ధరుళాయే...

6. ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో
ఇఱైయవర్ పదినొరు విడైయరుం ఇవరో
మరుమియ ముయిలిన నఱుముగ నివనో
మరుదరుమ్ పశుక్కలమ్ వన్దు వన్దీణ్డియ వెళ్ళమ్
అరువరైయనై యనిన్ కోయిల్ మున్నివరో
అరంగత్తమా పళ్ళి యెళున్ధరుళాయే

7. అన్ధరత్తమరర్ గళ్ కూట్టంగళివైయో
అరుందవ మునివరుం మరుదరుమివరో
ఇన్దిర నానైయుమ్ తానుమ్ వన్దివనో
ఎమ్బెరు మానున కోయిలిన్ వాశల్
శున్ధరర్ నెరుక్కవిచ్చాదరర్ నూక్క
ఇయక్కరుమ్ మాయంగినర్ తిరువడిత్తొళువాన్
అన్ధరమ్ పారిడ మిల్లైమత్తిదువో
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే.

8. వమ్బవిళింవానవర్ వాయుఱై వళుజ్గ
మానిది కపిలై యొణ్ కణ్ణాడిముదలా
ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు
ఏర్పన వాయినకొణ్డు నన్మునివర్
తుమ్బురునారదర్ పుగున్ధన రివరో
తోన్ఱిన విరవియమ్ తులంగొళి పిరప్పి
అమ్బరతలత్తి, నిన్ఱగల్ గిన్ఱ దిరుళ్ పోయ్
అరంగత్తమ్మా పళ్ళి యెళున్ధరుళాయే...

9. ఏదమిల్ తణ్ఱుమై యెక్కమ్ మత్తళి
యాళుమ్ కుళుల్ ముళువమో డిశైదిశైకైళుమి
కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్ గళ్
కన్ధరు వరుమివర్ కజ్గలు ళెల్లామ్
మాదవర్ వానవార్ శారణర్ ఇయక్కర్
శిత్తరుమ్ మయంగినర్ తిరువడిత్తోళువాన్
ఆదలిలవర్కునాళో లక్కమరుళ
అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే..

10. కడిమలర్కములంగళ్ మరల్ న్ధన వివైయా
కదిరవన్ కనైకడల్ ముళైత్తన నివనో
తుడియుడైయార్ శురికుళుల్ పిఱున్దుదఱి
త్తయిలుడుత్తే ఱినర్ శూళుంపునలరంగా!
తొడై యొత్తతుళవముమ్ - కూడైయుమ్ పొలిన్దు
తోన్ఱియతోళ్ తొణ్ణరడిప్పొడి యెన్నుమ్
ఆడియనై యళియనెన్ఱరుళియున్నడియార్కు
అప్పడుత్తాయ్ పళ్ళియెళున్ధరు ళాయే
తొండరడి యాళ్వార్ తిరువడిగళే శరణం.

తొండరడిప్పొడి యాళ్వార్ తిరువడి ఘళే శరణమ్
(అని నమస్కారము చేయవలెను)
అణ్డాళ్ తిరువడిగళే శరణమ్
నీలా తుంగస్తన గిరిత సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ద మధ్యాపయన్తీ|
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||

అన్నవయల్ పుదువై యాండా ళరంగఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
పాడి కోడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడిక్కొడుత్తాళై చ్చొల్.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS